twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌ ...మూడో వివాహం ప్రత్యక్ష సాక్షులు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌కు అస్ట్రేలియన్‌ యువతి అన్నా లెజ్‌నివాతో మూడో పెళ్లి జరిగిన సంగతి గత కొద్ది రోజులుగా మీడియాలో సెన్షేషన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎర్రగడ్డలోని జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సెప్టెంబరు 30న రిజిస్టర్‌ మ్యారేజి జరిగినట్టు నమోదయ్యింది. ఈ పెళ్లి కోసం ఆగస్టు 30వ తేదీన పవన్‌ కల్యాణ్‌, అన్నా లెజ్‌నివా దరఖాస్తు చేసుకున్నారని సబ్‌ రిజిస్ట్రార్‌ బాసిత్‌ సిద్ధిఖీ తెలిపారు. నెల రోజుల తరువాత అన్నీ సవ్యంగానే ఉన్నాయని భావించి రిజిస్టర్‌ మ్యారేజి జరిపించామని చెప్పారు. ఈ వివాహానికి ముగ్గురు సాక్ష్యులు ఉన్నారని తెలుస్తోంది.

    ఆ సాక్ష్యులు మీడియాలో వినపడుతున్న దాన్ని బట్టి మరెవరో కాదు.. ఆనంద సాయి(ఆర్ట్ డైరక్టర్), ఎన్. శ్రీనివాస్(గబ్బర్ సింగ్ లో ముస్లిం కానిస్టేబుల్ ),పవన్ పర్శనల్ సెక్రటరీ అబ్దుల్ హనీఫ్. ఈ వివాహం పవన్ కి ఆప్తుడు, అత్యంత నమ్మకస్ధుడు అయిన శరద్ మరార్ ఆధ్వర్యంలో జరిగినట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై ఆఫీషియల్ న్యూస్ ఏమీలేదు. కేవలం మీడియాలో,ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నది మాత్రమే అని గమనించాలి.


    విశ్వసనీయ సమాచారం ప్రకారం.... 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలైన రెండు రోజులకు బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 12లో ఉన్న పవన్‌ నివాసంలోనే వివాహ వేడుక జరిగినట్టు తెలిసింది. పవన్‌కి అత్యంత సన్నిహితులైన కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. ఆస్ట్రేలియా పౌరురాలైన అన్నా లెజ్‌నివా ఓ మోడల్‌గా, నటిగా కెరీర్‌ని కొనసాగిస్తున్నట్టు తెలిసింది. పవన్‌, అన్నా లెజ్‌నివాలు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆ విషయాన్ని పెళ్లి కోసం సమర్పించిన అఫిడవిట్‌లోనూ పవన్‌ పేర్కొన్నారు. వీరిద్దరికీ ఓ పాప పుట్టినట్లు తెలుస్తోంది.

    ఈ వివాహానికి సాక్షులుగా వ్యాపారులు మహ్మద్‌ అబ్దుల్‌ ఆరిఫ్‌, ఎన్‌.శ్రీనివాస్‌లతో పాటు ఆర్ట్‌ డైరెక్టర్‌ బి.అనంద్ లు సంతకాలు చేశారు. నోటీస్‌ నెం.50, మ్యారేజ్‌ నెం.43 కింద పవన్‌ కల్యాణ్‌ పెళ్లి నమోదయ్యింది. అన్నా లెజ్‌నివా విదేశీ యువతి కావడంతో స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ సెక్షన్‌-13 కింద ప్రత్యేక ధృవపత్రం జారీ చేశారు. ఇదిలా ఉంటే పవన్‌ కల్యాణ్‌కు విశాఖపట్నానికి చెందిన నందినితో తొలిసారి పెళ్లి జరిగింది. ఆమెతో విడాకులు తీసుకున్న అనంతరం రేణు దేశాయ్‌తో రెండో పెళ్లి అయ్యింది. ఈమె నుంచి కూడా పవన్‌ కల్యాణ్‌ వేరుపడినట్లు తెలిసింది. తాజాగా అన్నా లెజ్‌నివాను వివాహం చేసుకోవడం ఇప్పుడు సంచలనమయ్యింది.

    పవన్‌ తో కలిసి 'తీన్‌మార్‌' చిత్రంలో నటించిన డానా మార్క్స్‌యే ఈ అన్నాలెజ్‌నివా అని ప్రచారం సాగుతోంది. అయితే, పెళ్లి రిజిస్ట్రేషన్‌ కోసం చేసుకొన్న దరఖాస్తులో ఉన్న అన్నా ఫొటోకీ, 'తీన్‌మార్‌'లో నటించిన డానాకీ పోలికలు లేవు. అయితే ఆ సినిమాలో అన్నా లెజ్‌నివా హీరోయిన్ గా కాకుండా, ఓ చిన్న సన్నివేశంలో మాత్రమే కనిపిస్తుందనే ప్రచారం కూడా ఉంది.

    English summary
    Now the focus is on who are the three eyewitnesses to Pawan Kalyan's most-talked about wedding? Going by sources, noted art director Anand Sai who share a great bond with Pawan Kalyan is one among the three eyewitnesses for Pawan's wedding. Anand has signed as a witness in Registrar office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X