Don't Miss!
- Sports దూబెకు అన్యాయం..ఇది భారత్కే మంచిది కాదు- రోహిత్
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Finance Stock Market: ఊపిరి పీల్చుకున్న బుల్స్.. లాభాల్లో సెన్సెక్స్-నిఫ్టీ.. ట్రెండిగ్లో జస్ట్డయల్..
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
రానా, సురేష్ బాబు చేసిన పనికి.... దిల్ రాజు అప్సెట్??
ఆగస్టు 11న మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ విషయంలో దిల్ రాజు అప్ సెట్ గా ఉన్నారట.
తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చే వారం(ఆగస్టు 11) మూడు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి', నితిన్ 'లై' మూవీ, బోయపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'జయ జానకి నాయక'.
ఆగస్టు 11వ తేదీ బాగా కలిసొచ్చే తేదీగా టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే వరుసగా హాలిడేస్ వస్తున్నాయి. ఆగస్టు 11న సినిమా రిలీజ్ చేస్తే.... 12, 13. 14, 15 ఇలా వరుసగా సెలవులు. దీంతో థియేటర్లు ప్రేక్షకుల రద్దీతో కళకళలాడటం ఖాయం.
రానా వల్ల దిల్ రాజు అప్ సెట్?
రానా మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి' సినిమా వల్ల దిల్ రాజు అప్సెట్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విషయంలో రానా, సురేష్ బాబులు తమ నిర్ణయాన్ని ఉన్నట్టుండి మార్చుకోవడమే ఇందుకు కారణమని అని అంటున్నారు.
Recommended Video
మాట మార్చారా?
‘నేనే రాజు నేనే మంత్రి' సినిమాను మొదట ఆగస్టు 18న తమిళ వెర్షన్ తో కలిసి రిలీజ్ చేస్తామని చెప్పారట సురేష్ బాబు. దీంతో ‘లై' మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకున్న దిల్ రాజు ఆగస్టు 11న తన సినిమాను రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి ‘నేనే రాజు నేనే మంత్రి' మూవీ రిలీజ్ డేట్ మార్చడంతో దిల్ రాజు కాస్త అప్ సెట్ అయ్యారట.
దిల్ రాజు బాధ అదే...
ఈ సినిమాలతో పాటు బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ‘జయ జానకి నాయక' మూవీ కూడా 11న తేదీనే విడుదలవుతోంది. ఒకేసారి మూడు సినిమాలు రిలీజ్ చేయడం ద్వారా థియేటర్లు తక్కువగా దొరకడంతో పాటు రెవెన్యూ కూడా తగ్గిపోతుందని, దీని వల్ల ఎవరికీ ఎలాంటి లాభం ఉండదని ఆయన వర్రీ అవుతున్నారట.
రంగంలోకి అల్లు అరవింద్
సురేష్ బాబుకు, దిల్ రాజుకు సన్నిహితంగా ఉండే అల్లు అరవింద్ కల్పించుకుని వీరి మధ్య పరిస్థితిని చక్కదిద్దేలా చోరవ తీసుకుంటున్నట్లు సమాచారం.