బాలకృష్ణకు త్రిష కంప్లైంట్ చేసి సెటిల్మెంట్
బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న బాడీగార్డులో త్రిష హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు సైతం బెల్లంకొండ రెమ్యునేషన్ బ్యాలెన్స్ ఎగ్గొట్టే స్కీమ్ వేసాడట. బ్యాలెన్స్ రెమ్యునేషన్ ని బాలకృష్ణతో తాము చేయబోయే సినిమాలో నటించి సెటిల్ చేసుకోమన్నాడుట. దాంతో ఎక్కడో కాలిన త్రిష వెంటనే ఈ విషయాన్ని బాలకృష్ణకు కంప్లైంట్ చేసిందని వినపడుతోంది. మొదట వెంకటేష్ తో ఈ సమస్యను చర్చించిన ఆమె వెంకటేష్ సైతం చేతులు ఎత్తేయటంతో ఈ పనిచేసిందని తెలుస్తోంది. బాలకృష్ణ వెంటనే ఎంటర్ అయ్యి త్రిషకు అభయమిచ్చి బెల్లంకొండను మందలించి ఆమె రెమ్యునేషన్ సెటిల్ చేసాడని చెప్తున్నారు. గతంలోనూ బెల్లంకొండ ఇలా చాలా మందిది రెమ్యునేషన్స్ ఎగ్గొట్టిన చరిత్ర ఉంది.
ప్రియమణికి చాలా బాకీ ఉన్నాడని,దాంతో పెద్ష గొడవే అయ్యిందని చెప్పుకున్నారు. ఆ తర్వాత రామ్ విషయంలోనూ ఎగ్గొట్టితే అతను మా దృష్టికి తీసుకెళ్లి సెటిల్ చేసుకున్నాడు. ఇప్పుడు త్రిష వంతు వచ్చింది.త్రిష ఇలా తెలివిగా బాలయ్యను సీన్ లోకి లాగి సెటిల్ చేసుకుంది. ఇక ఇప్పుడు త్రిష..బాలకృష్ణ ప్రక్కన బెల్లంకొండ సినిమాకి నో అంటోంది.దానికి కారణం బెల్లంకొండ ప్రవర్తనే అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ , హీరోలు బెల్లంకొండ సురేష్ అంటే ఆలోచనలో పడే పరిస్ధితి ఏర్పడింది.


Click it and Unblock the Notifications











