Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
డిమాండ్ లేదు..అయినా కోటి పాతిక
హైదరాబాద్ : త్రిష కు చెప్పుకోతగ్గ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం. బాలకృష్ణ తో చేస్తున్న గాడ్సే చిత్రం కోసం ఆమెకు ఇచ్చిన ఎమౌంట్ గురించే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది.
అలాగే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ...'లెజెండ్'లో బాలకృష్ణతో ఆడిపాడి ప్రేక్షకులను అలరించిన రాధికా ఆప్టే ని తీసుకున్నారు. అందులో పెద్ద బాలకృష్ణ మేనకోడలుగా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఆమె మరోసారి బాలకృష్ణతో నటిస్తోంది. బాలకృష్ణ తాజా చిత్రంలో ఓ హీరోయిన్ గా రాధికా ఆప్టేను ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష చేస్తోంది.
నిర్మాత మాట్లాడుతూ...''సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కూ సమ ప్రాధాన్యముంటుంది. 'లెజెండ్'లో రాధిక నటనను చూసి ఈ సినిమా కోసం తీసుకున్నాం. ఆమెకు ఈ పాత్ర మంచి పేరు తీసుకొస్తుంది'' అన్నారు.
ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో మణిశర్మ,బాలకృష్ణ కాంబినేషన్ లో నరసింహనాయుడు, సమరసింహా రెడ్డి, లక్ష్మీ నరసింహా వంటి చిత్రాలు వచ్చి మ్యూజికల్ గానూ విజయవంతమయ్యాయి. ''బాలకృష్ణ శైలికి తగ్గ కథ ఇది. కుటుంబ అనుబంధాలతోపాటు అభిమానుల్ని అలరించే అన్ని అంశాలూ ఇందులో ఉంటాయి. సాంకేతిక విలువలకు ప్రాధాన్యమిస్తూ భారీ వ్యయంతో రూపొందించబోతున్నాం.''అని దర్శకుడు తెలిపారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రుద్రపాటి రమణారావు నిర్మాత. ఇందులో బాలకృష్ణ సీబీఐ అధికారిగా కనిపిస్తారని సమాచారం. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: వెంకటప్రసాద్. కళ: రవీందర్.