Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పార్టీలకే గానీ ప్రక్కన నటించటానికి పనికిరాడా
హైదరాబాద్ : తమ్ముడు...తమ్ముడే..పేకాటే అన్నట్లు మన హీరోయిన్స్...ప్రొఫెషన్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అనేది ఖచ్చితంగా తెలుసు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. తాజాగా త్రిష అలాంటి విషయంలోనే తానేంటో తెలియచేసింది. రానా తో ఎఫైర్ ఉందంటూ వార్తల్లో కనపడుతూ ఎప్పుడూ అతనితో పార్టీలు అంటూ తిరిగే ఆమె ఇప్పుడు రానా ప్రక్కన నటించటానికి మాత్రం నో చెప్పేసింది.
తెలుగులో బాలకృష్ణ సరసన, తమిళంలో అజిత్ సరసన చేస్తున్న ఆమెను రానా ప్రక్కన అడిగారట. అయితే ఆమె తాను పెద్ద హీరోల ప్రక్కన చేస్తున్నానంటూ..ప్రస్తుతం డేట్స్ ఖాలీ లేవంటూ నో చెప్పిందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రానా సైతం ఆశ్చర్యపోయి..ఆమెను అగిడితే..తెరమీద జంటగా కనపడితే తమ మీద వస్తున్న వార్తలు నిజం అనుకునే అవకాసం ఉందంటూ సమాధానమిచ్చిందిట.
త్రిష కు చెప్పుకోతగ్గ పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. అయినా ఆమె తన రెమ్యునేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీ పడలేదని సమాచారం. బాలకృష్ణ తో చేస్తున్న గాడ్సే చిత్రం కోసం ఆమెకు ఇచ్చిన ఎమౌంట్ గురించే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు కోటి పాతిక లక్షలు వరకూ పే చేసారని తెలుస్తోంది. మొదట నిర్మాతలు అంత పే చేయటానికి ముందుకు రాలేదని అయితే బాలకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి వారిని ఒప్పించి, ఆమెను తన సినిమాలోకి తీసుకున్నారని వినిపిస్తోంది.
అలాగే ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ...'లెజెండ్'లో బాలకృష్ణతో ఆడిపాడి ప్రేక్షకులను అలరించిన రాధికా ఆప్టే ని తీసుకున్నారు. అందులో పెద్ద బాలకృష్ణ మేనకోడలుగా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఆమె మరోసారి బాలకృష్ణతో నటిస్తోంది. బాలకృష్ణ తాజా చిత్రంలో ఓ హీరోయిన్ గా రాధికా ఆప్టేను ఎంపిక చేశారు. ఇప్పటికే ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష చేస్తోంది.