Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్య-త్రిషపై రూమర్లు... మండిపడుతున్న ఫ్యాన్స్!
హైదరాబాద్: నందమూరి నట సింహం బాలయ్య తర్వాతి సినిమాలో హీరోయిన్ త్రిష రొమాన్స్ చేయబోతోందనే రూమర్లు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. బెల్లకొండ సురేష్ నిర్మించనున్న ఈచిత్రానికి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారని ఆ వార్తల సారాంశం. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడ లేదు.
ఆ సంగతి పక్కన పెడితే...బాలయ్య అంకుల్ సరసన త్రిష ఆంటీ అంటూ కొందరు నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. బాలయ్య సరసన యంగ్ హీరోయిన్లు చేయడానికి ఇష్ట పడటం లేదని, మరో వైపు త్రిషను కూడా యంగ్ హీరోలంతా పక్కన పెట్టారని.....అవకాశాలు లేక త్రిష బాలయ్యతో చేయడానికి ఓకే చెప్పిందని, బాలయ్య కూడా త్రిషతో చేయడానికి ఓకే చెప్పాడని అంటున్నారు. అయితే ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటంపై ఇలా నెటెటివ్గా ప్రచారం జరుగడంపై బాలయ్య అభిమానులు మండి పడుతున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా బాలయ్య ఇమేజ్ చెక్కు చెదరదని, ఆయన రేంజే వేరని అంటున్నారు ఫ్యాన్స్.
ఆ విషయం పక్కన పెడితే...త్రిష ఇప్పటి వరకు టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లతో కలిసి నటించింది. బాలయ్యతో మాత్రం నటించలేదు. బాలయ్య-బెల్లంకొండ సినిమా వార్త నిజమైతే త్రిష టాలీవుడ్ అగ్రహీరోలందరితో చేసిన హీరోయిన్ల లిస్టులో చేరిపోవడం ఖాయం.
బాలయ్య ఇటీవల నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం బాక్సాపీసు వద్ద మంచి ఫలితాలనే ఇచ్చింది. రవికుమార్ చావలి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని రమేష్ పుప్పాల 'ఎల్లో ఫ్లవర్స్' బేనర్ పై నిర్మించారు. పార్వతి మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లు. చక్రి సంగీతం అందించారు.
బాలయ్య త్వరలో 'ఆదిత్య 999' చిత్రంలో నటింబోతున్నట్లు తెలుస్తోంది. 'ఆదిత్య 999' ఈ చిత్రానికి సింగితం శ్రీనివాస రావు దర్శకత్వం వహించనున్నారు. కొండ కృష్ణం రాజు సమర్పణలో వినోద్ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈచిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.