బన్నీ మూవీ ఫంక్షన్కు గెస్టులుగా పవన్-మహేష్?
హైదరాబాద్: బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సన్నా ఆప్ సత్యమూర్తి' మూవీ ఆడియో మార్చి 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు గెస్టులుగా హాజరయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్స్ త్రివిక్రమ్ కు చాలా క్లోజ్ కావడంతో వీరిని ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయం అఫీషియల్ గా ఖరారు కావాల్సి ఉంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు

వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











