Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బన్నీ ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్.. ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వీళ్లిద్దరి కలయికలో గతంలో 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ రెండింటి తర్వాత వస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయింది.
హిట్ కాంబినేషన్ కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కూడా నటిస్తున్నాడు. అలాగే సీనియర్ నటి టబు దీని ద్వారా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు, ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటి నుంచి ఎన్నో అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ సినిమాలో నివేదా థామస్ నటిస్తోందని, అది కూడా బన్నీకి చెల్లెలిగా చేస్తుందని ఓ వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమాలో నగ్మా నటిస్తుందని అన్నారు. రెండు రోజులుగా ఈ సినిమాలో ద్వారా సీనియర్ నటి సంగీత రీ ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.
అలాగే, ఈ సినిమాకు 'నాన్న నేను' అని పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో తండ్రి సెంటిమెంట్ చూపించబోతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భగా ఆగస్టు 15న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారనేదే ఆ వార్త సారాంశం. ఇందులోనే టైటిల్ను కూడా రివీల్ చేస్తారని అంటున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీగా ఫీల్ అయిపోతున్నారు.