Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
త్రివిక్రమ్ శ్రీనివాస్ చేత ఆ ప్రాజెక్టుకు స్క్రిప్టు రాయిస్తున్న దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆ మధ్యన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" అనే టైటిల్ తో ఓ చిత్రం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త బంగారు లోకం దర్సకుడు అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో వెంకటేష్, పవన్ కళ్యాణ్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఈ వార్తకు మరొకటి కలిసింది. అది త్రివిక్రమ్ శ్రీనివాస్ చేత ఈ చిత్రానికి డైలాగులు రాయిస్తున్నారని,అదీ పవన్ కళ్యాణ్ పట్టుబట్టి చేయిస్తున్నాడనీను. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన చిత్రం తీన్ మార్ కి త్రివిక్రమ్ చేత స్క్రిప్టు వర్క్ చేయించారు. డైరక్టర్ అయ్యాక వేరే వారి సినిమాలకు రాయని త్రివిక్రమ్ పవన్ పట్టుదలతో ఇలా బయిట సినిమాలకు స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్..మహేష్ తో చేసిన ఖలేజా అనంతరం ఒక్క చిత్రం కూడా ప్రారంభించలేదు. వెంకటేష్ కి, అల్లు అర్జున్ కి విడివిడిగా కథలు వినిపించి వారి డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మరియూ పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్లపై కలిపి చేయనున్నారు.