Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
త్రివిక్రమ్ కొత్త బిజినెస్.. మరో అడుగు ముందుకేస్తూ మహేష్ బాబుకు ధీటుగా!
నేటితరం సినీ ప్రముఖులు చాలా డిఫెరెంట్గా ఆలోచిస్తున్నారు. కేవలం సినిమానే లోకం అనుకోకుండా పలు విదాలుగా డబ్బు సంపాదించే ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు బిజినెస్మాన్లుగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఇదే బాటలో త్రివిక్రమ్ వెళుతున్నారని తెలిసింది.
సినీ ప్రముఖులు విభిన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కొత్తేమీ కాదు. బాలివుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు సినిమాయేతర వ్యాపార లావాదేవీల్లో మునిగిపోయారు. ఇప్పుడు అలాంటి వారి చెంత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరారని సమాచారం. థియేటర్ ప్రారంభించాలనే ఆలోచన రావడంతో వెంటనే దానిని అమలు పరిచే ఏర్పాట్లు చేస్తున్నారట త్రివిక్రమ్.
ఈ మేరకు రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఆయన ఓ సినిమా థియేటర్ కాంప్లెక్స్ను కొనుగోలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయమా తెలుసుకున్న త్రివిక్రమ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన బిజినెస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. దర్శకుడిగా సూపర్ సక్సెస్ సాధించిన త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాతో బిజీగా ఉన్నారు .
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు 'అల.. వైకుంఠపురములో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల నడుమ జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.