Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ ఫ్యాన్స్ కి పండగే.. నారీ నారీ నడుమ మురారి.. ఆ బాలీవుడ్ భామ కూడా ఫిక్స్?
సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. ప్రకటించిన దాని ప్రకారం అయితే ఇక సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. మరి కరోనా కారణంగా లేట్ అవుతుందేమో చూడాలి. ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సినిమాలో ఇద్దరు భామలను ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
తాజాగా వినిపిస్తున్న వార్తలు ప్రకారం త్రివిక్రమ్ - మహేష్ బాబు ప్రాజెక్టును లాంచ్ చేయడానికి ముహూర్తం ఖాయమైపోయింది అని అంటున్నారు. మే 31వ తేదీ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినిమా లాంచ్ మాత్రమే కాక ఏదైనా అప్ డేట్ వస్తుందని భావిస్తున్నారు. కృష్ణ పుట్టినరోజు నాడే సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా కారణంగా చాలా సింపుల్ గా ఈ కార్యక్రమాన్ని జరపనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ అన్ని సినిమాల్లో ఇద్దరేసి హీరోయిన్స్ ఉంటారు.
వినిపిస్తున్న టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఈ సినిమా కోసం కూడా ఇద్దరు హీరోయిన్స్ ను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే ఒక హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్లు రూమర్స్ అయితే వచ్చాయి కానీ ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా రెండో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. సౌత్ లో సినిమాలు చేయాలని చూస్తున్న ఆ భామ కూడా సినిమా చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. ఇక ఎన్ని రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా త్రివిక్రమ్ టీమ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేసి నటీనటుల వివరాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.