Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మహేష్ సినిమా తరువాత త్రివిక్రమ్ కోసం మరో హీరో రెడీ.. ఫైనల్ స్టేజ్ లో పాన్ ఇండియా చర్చలు?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి షెడ్యూల్ పని కూడా ఇటీవల పూర్తయింది. ఇక రెండవ షెడ్యూల్ ను మరికొన్ని రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు. అయితే మహేష్ బాబు సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ హీరోతో వర్క్ చేస్తాడు అనే విషయంలో కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. తప్పకుండా అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో కూడా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.
నిజానికి అల్లు అర్జున్ త్రివిక్రమ్ తరచుగా మాట్లాడుకుంటారు అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రమంలో వారు ప్రాజెక్టు చేస్తున్నారా లేదా అనే విషయంలో మాత్రం ఎవరు సరైన సమాధానం చెప్పలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఇద్దరి మధ్యలో ఒక స్క్రిప్ట్ కు సంబంధించి చర్చిలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్లాన్ లో బిజీగా ఉంటూనే మరోవైపు త్రివిక్రమ్ ఖాళీగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టు గురించి చర్చలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
అయితే మహేష్ సినిమాను ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్న త్రివిక్రమ్ ఆ సినిమాను 2023 మార్చిలో విడుదల చేయాలని ఒక ప్లాన్ అయితే ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్తో వీలైనంత తొందరగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సక్సెస్ కావడంతో తరువాత సినిమాలను కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరపైకి తీసుకురావాలి అని ఆలోచనతో ఉన్నారు.
కాబట్టి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయి ఉంటుంది అని మరొక టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ చర్చలు ఫైనల్ సైజ్ కు చేరినట్లు సమాచారం. అయితే అంతకుముందే మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా చేస్తాడు అని కూడా టాక్ వచ్చింది కానీ మహేష్ మాత్రం రాజమౌళి తోనే మొదటి పాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక త్రివిక్రమ్ అయితే అల్లు అర్జున్ తో సినిమా చేస్తే మాత్రం తప్పకుండా అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది అని అనిపిస్తోంది. ఇక త్రివిక్రమ్ తో మరో సినిమాను బన్నీ పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ముగిసిన తర్వాత మొదలు పెట్టే అవకాశం ఉంటుంది.