Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Ala Vaikunthapurramloo VS Sarileru Neekevvaru: క్లాష్ లేనట్లే.. హింట్ ఇచ్చేసిన అల్లు అర్జున్ టీమ్!
టాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య నెలకొన్న పోటీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా పెద్ద సినిమాల క్లాష్ అంటే అది ట్రేడ్ వర్గాలకు ఎదురు దెబ్బ లాంటింది. అలాంటి ఓ క్లాష్ అల్లు అర్జున్- మహేష్ బాబు మధ్య నెలకొనడం తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికర అంశంగా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరి సినిమాలను ఒకేరోజు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ టీమ్ నుంచి వచ్చిన ఓ అప్డేట్ సందేహం కలిగిస్తోంది. వివరాల్లోకి పోతే..
అల్లు అర్జున్- మహేష్ బాబు సినిమాలు.. సంక్రాంతి రేస్
ప్రతీ ఏడాది సంక్రాంతి కానుకగా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల చేస్తుంటారు మేకర్స్. హాలిడే సీజన్ కావడం తమ సినిమాలకు ట్రేడ్ పరంగా బాగా కలిసొస్తుందని ఇలా చేస్తుంటారు. ఈ బాటలోనే అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాను, మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను సంక్రాంతి రేస్లో పెట్టేశారు. అయితే ఈ రెండు సినిమాలు జనవరి 12నే విడుదల కానుండటం చర్చనీయాంశంగా మారింది.
ఇంతలో త్రివిక్రమ్ టీమ్ హింట్
దీంతో ఇక స్టార్ హీరోలు అల్లు అర్జున్- మహేష్ బాబు మధ్య క్లాష్ అనివార్యం అని అనుకుంటున్న తరుణంలో త్రివిక్రమ్ టీమ్ ఓ హింట్ ఇచ్చింది. తాజాగా 'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి కొత్తపోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అల్లు అర్జున్ లుక్ ఆకట్టుకుంటోంది. కానీ ఇప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయబడిన 'అల.. వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఇందులో ముద్రించక పోవడంతో అనుమానాలు తలెత్తాయి.
|
మార్చేసుకున్నారా? అసలు కారణాలేంటి..
అల్లు అర్జున్- మహేష్ బాబు క్లాష్ ట్రేడ్ పరంగా అంత మంచిది కాదని ముందు నుంచి ఓ వాదన వినిపిస్తూనే ఉంది. ఈ క్లాష్ కారణంగా ఈ రెండు సినిమాల రైట్స్, కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. బహుశా ఇది గమనించే ఈ రెండు సినిమాల విధుల తేదీలను మార్చేశారేమో అనే టాక్ మొదలైంది. ఇంతలో 'అల.. వైకుంఠపురములో' కొత్త పోస్టర్ లో రిలీజ్ డేట్ లేకపోవడం అది ఖాయం అని చెప్పేసింది.
అల్లు అర్జున్- మహేష్ బాబు రాజీ.. కారణం ఆయనే
ఇక గతంలో ఇదే విషయమై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంటరై.. అల్లు అర్జున్- మహేష్ బాబు మధ్య రాజీ కుదిర్చారని వార్తలు వచ్చాయి. ‘సరిలేరు నీకెవ్వరు' సినిమాను జనవరి 13న రిలీజ్ చేయాలని, అలాగే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో' సినిమాను జనవరి 11న విడుదల చేయాలని వాళ్ళ మధ్య ఓ ఒప్పందం కుదిర్చారని అన్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే అదే నిజమైందని స్పష్టంగా తెలుస్తోంది.
అప్పటి లాగే జరుగనుందా? పీఆర్ టీమ్స్ రియాక్షన్
గతంలో కూడా మహేష్ బాబు ‘భరత్ అను నేను', అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య' సినిమాల విషయంలో ఇలాగే క్లాష్ ఎదుర్కొని చివరకు వారం తేడాలో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. సో.. ఇప్పుడు కూడా అదే కన్ఫర్మ్ అయినట్లుగా హింట్స్ వస్తున్నాయి. చూడాలి మరి ఈ ఇష్యూపై ఈ రెండు సినిమాల పీఆర్ టీమ్స్ ఎలా రియాక్ట్ అవుతాయో.