Don't Miss!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- News మాకు ఏమిచ్చారని మీకు ఓటేయాలి: రేవంత్ రెడ్డి ఫైర్
- Sports రోహిత్-కోహ్లిపై సెలక్టర్లు సంచలన నిర్ణయం!
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
- Automobiles బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
సీనియర్ హీరోయిన్ కోసం విలాసవంతమైన ఇల్లు.. త్రివిక్రమ్ పని చూడండి!
Recommended Video
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సీనియర్ హీరోయిన్ కోసం విలాసవంతమైన ఇల్లు నిర్మించారట. ఇందుకోసం ఏకంగా 4 కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సెన్సేషన్గా మారింది. ఇంతకీ త్రివిక్రమ్ నిర్మించిన ఆ ఇల్లు ఎవరికోసం? అసలు విషయం ఏంటి? వివరాల్లోకి పోతే..
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా ‘అల.. వైకుంఠపురములో'. బన్నీ కెరీర్లో నా పేరు సూర్య డిసాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఇటీవలే ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియోతో స్పెషల్ ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్.
|
సీనియర్ హీరోయిన్ టబు రీ ఎంట్రీ
‘అల.. వైకుంఠపురములో' సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఒకప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కీర్తించబడిన టబు గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. త్రివిక్రమ్ కోరిక మేరకు ఈ సినిమాలో నటించేందుకు టబు ఓకే చేసిందని సమాచారం. చిత్రంలో జయరాంకి జోడీగా టబు నటిస్తోంది.
విలాసవంతమైన ఇల్లు.. అదీ అన్నపూర్ణ స్టూడియోస్లో
ఇటీవలే భారీ షెడ్యూల్ని పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ యూనిట్ చిన్న బ్రేక్ తీసుకొని మరో షెడ్యూల్ కోసం రెడీ అయింది. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్లో విలాసవంతమైన ఇల్లు సెట్ వేస్తున్నారట త్రివిక్రమ్. ఇందులోనే మేజర్ పార్ట్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది.
ఆ ఇంటి పేరే వైకుంఠపురము
హీరోయిన్ పూజా హెగ్డే తల్లి దండ్రులుగా జయరాం, టబు నటిస్తున్నారని.. వారుండే ఆ విలాసవంతమైన ఇంటి పేరే వైకుంఠపురము అని తెలుస్తోంది. హీరోయిన్ పేరు అలకనంద అని, అందుకే ఆ రెండు పేర్లు కలిసేలా.. త్రివిక్రమ్ స్టైల్లో ‘అల.. వైకుంఠపురములో' నే పేరు పెట్టారని సమాచారం. ఇక పల్లెటూరి కుర్రాడిగా అల్లు అర్జున్ నటన, డైలాగ్స్ సినిమాలో హైలైట్ అవుతాయని తెలిసింది.
‘అల.. వైకుంఠపురములో' మూవీ
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సీనియర్ నటి టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ కెరీర్లో 19వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.