Don't Miss!
- News మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య నృత్య ప్రదర్శన
ప్రముఖ రచయిత మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి మిసెస్ సౌజన్య క్లాసికల్ డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఆమె నృత్య ప్రదర్శన ఈ నెల(జనవరి) ఇరవై మూడున తేదీన రవీంధ్ర భారతిలో ఉంది. ఆమె కూచపూడి డాన్స్ లో ఎక్సపెర్ట్. అలాగే ఈ ప్రదర్శన అందరికీ కాకుండా ఎక్సక్లూజివ్ గా కొందరికి మాత్రమే నని తెలుస్తోంది. ఇక వివాహానికి ముందు అనంతరం త్రివిక్రమ్ ఆమెను ఈ కళ వైపు ప్రోత్సహిస్తూనే వచ్చారు. ముఖ్యంగా త్రివిక్రమ్ వివాహనికి కారణం ఈ నృత్యంలో ఆమె ప్రవీణురాలవటం కూడా కారణమని చెప్తూంటారు. ఎందుకంటే మొదటి నుంచీ త్రివిక్రమ్ కి కళలలంటే విపరీతమైన ఆసక్తి, అనురక్తి కారణం. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ తన లేటెస్ట్ ప్రాజెక్టు మహేష్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం మహేష్ రెండు సంవత్సరాలు గా ఎదురు చూస్తున్నారు. అతిది అనంతరం మహేష్ ఏ చిత్రం కమిట్ కాకుండా దీనికై తన డేట్స్ ని కేటాయించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు వంటి సూపర్ హిట్ రావటమే దీనికి కారణం. ఇవన్నీ ప్రక్కన పెడితే మిసెస్ సౌజన్యా శ్రీనివాస్ కూచిపూడి ప్రదర్శన విజయవంతం కావాలని కోరుకుందాం.