Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య నృత్య ప్రదర్శన
ప్రముఖ రచయిత మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి మిసెస్ సౌజన్య క్లాసికల్ డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఆమె నృత్య ప్రదర్శన ఈ నెల(జనవరి) ఇరవై మూడున తేదీన రవీంధ్ర భారతిలో ఉంది. ఆమె కూచపూడి డాన్స్ లో ఎక్సపెర్ట్. అలాగే ఈ ప్రదర్శన అందరికీ కాకుండా ఎక్సక్లూజివ్ గా కొందరికి మాత్రమే నని తెలుస్తోంది. ఇక వివాహానికి ముందు అనంతరం త్రివిక్రమ్ ఆమెను ఈ కళ వైపు ప్రోత్సహిస్తూనే వచ్చారు. ముఖ్యంగా త్రివిక్రమ్ వివాహనికి కారణం ఈ నృత్యంలో ఆమె ప్రవీణురాలవటం కూడా కారణమని చెప్తూంటారు. ఎందుకంటే మొదటి నుంచీ త్రివిక్రమ్ కి కళలలంటే విపరీతమైన ఆసక్తి, అనురక్తి కారణం. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ తన లేటెస్ట్ ప్రాజెక్టు మహేష్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం మహేష్ రెండు సంవత్సరాలు గా ఎదురు చూస్తున్నారు. అతిది అనంతరం మహేష్ ఏ చిత్రం కమిట్ కాకుండా దీనికై తన డేట్స్ ని కేటాయించారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు వంటి సూపర్ హిట్ రావటమే దీనికి కారణం. ఇవన్నీ ప్రక్కన పెడితే మిసెస్ సౌజన్యా శ్రీనివాస్ కూచిపూడి ప్రదర్శన విజయవంతం కావాలని కోరుకుందాం.