Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
జూ. ఎన్టీఆర్పై చానెల్ డైరెక్ట్ అటాక్: ఫ్యాన్స్ గరం
హైదరాబాద్: నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్పై ఓ తెలుగు టీవీ చానెల్ నేరుగా దాడి చేస్తూ ప్రసారం చేసిన వార్తాకథనంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పిల్లకాకి అంటూ ఆ చానెల్ జూనియర్ ఎన్టీఆర్పై వ్యాఖ్యానించింది. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ పర్యటన చేసిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్తో బాలయ్యకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని వార్తాకథనాలు వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ బాలయ్యపై పోరు చేయడానికి సిద్ధపడినట్లు కూడా మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఓ తెలుగు టీవీ చానెల్ జూనియర్ ఎన్టీఆర్పై ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్తో పోల్చుకుంటున్నాడని అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేదని వ్యాఖ్యానించింది. ఓ రకంగా నేరుగా జూనియర్ ఎన్టీఆర్పై దాడి చేసినట్లు ఆ వార్తాకథనం ఉందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
ఆ వార్తాకథనంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కుతకుత ఉడిపోతున్నట్లు చెబుతున్నారు. మాస్ ఇమేజ్తో ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్న తమ హీరోను చానెల్ పిల్లకాకి అంటూ అభివర్ణించడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటే ఆ పార్టీకి కష్టాలు తప్పవని అంటున్నారు.
బాద్షా చిత్రం విడుదలైన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పిల్ల కాకో, పిల్ల పులియో తెలిసి వస్తుందని ఆయన అభిమానులు అంటున్నారని సమాచారం. ఏమైనా, జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ పర్యటన పెద్ద దుమారాన్నే రేపింది.