ఉదయ్ కిరణ్ ని చేరదీస్తున్న జూ ఎన్టీఆర్
చిరంజీవి కుటుంబంతో వైరం పెట్టుకుని ఇండస్ట్రీకి దూరమైన ఉదయ్ కిరణ్ రీసెంట్ గా నందమూరి క్యాంప్ లో అడుగుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అతన్ని జూ ఎన్టీఆర్ చేరదీసి తన తాజా చిత్రం టైగర్ లో గెస్ట్ రోల్ ఇస్తున్నారని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందున్న ఈ చిత్రంలో శృతిహాసన్, ప్రియమణి హీరోయిన్స్ గా చేస్తున్నారు. సింహాతో విజయం సాధించిన బోయపాటి చాలా గ్యాప్ తీసుకుని ఈ కథని అన్ని జాగ్రత్తలతో తయారు చేసి ఎన్టీఆర్ ని ఒప్పించాడని చెప్తున్నారు. ఇక ఉదయ్ కిరణ్ కి ఈ చిత్రంతో మరికొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఉదయ్ కిరణ్ తాను హీరోగానే కాకుండా కొద్దిగా ప్రధాన్యత ఉండే పాత్రలు చేయటానికి కూడా రెడీ అవుతున్నట్లు వినపడుతోంది. అయితే ఇన్నాళ్ళు ఉదయ్ కిరణ్ తో ఎందుకుని ఆగినవారు ఎన్టీఆర్ చొరవ చేయటంతో మళ్ళీ మొదలెట్టే ఆస్కారం ఉంది. ఉదయ్ కిరణ్ కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుందని ఆశలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











