Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మల్టీస్టారర్గా చిరంజీవి - బాబీ మూవీ: ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు ఫిక్స్.. దాన్ని మించిపోయేలా ప్లాన్!
దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చిన ఆయన.. అనతి కాలంలోనే అసాధారణమైన నటనతో స్టార్ హీరోగా ఎదగడంతో పాటు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇచ్చారు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టిన ఆయన.. వరుసగా చిత్రాలను ప్రకటిస్తూ షాకిస్తున్నారు. ఇందులో భాగంగానే కేఎస్ రవీంద్ర (బాబీ)తో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!
ఎద అందాలతో విష్ణుప్రియ.. సొగసులు, హొయలతో ఆకట్టుకొంటున్న బ్యూటీ (ఫోటోలు)
ఇప్పటికే రెండు సినిమాలు.. రెండు ఫలితాలు
చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఆయన మరింత వేగం పెంచి వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది 'సైరా: నరిసింహారెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది ఆయనకు నిరాశనే మిగిల్చింది.
మెగా మల్టీస్టారర్లో చిరంజీవి.. చరణ్తో కలిసి
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివతో కలిసి 'ఆచార్య' అనే సినిమాను చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. అలాగే, రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ ఎన్నో రికార్డులు సాధించింది.
మలయాళ హిట్ సినిమా రీమేక్లో మెగాస్టార్
'ఆచార్య' పట్టాలపై ఉండగానే 'లూసీఫర్' రీమేక్ను ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. మలయాళంలో మోహన్లాల్ హీరోగా మరో స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దీన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్పై దృష్టి పెట్టిన డైరెక్టర్.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేస్తున్నాడట.
హిట్ లేని డైరెక్టర్తో ‘వేదాళం' రీమేక్లో చిరు
తెలుగులో పలు సినిమాలు చేసినా హిట్ను మాత్రం దక్కించుకోలేకపోయాడు మెహర్ రమేశ్. అతడికి మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇచ్చారు. దీంతో తమిళంలో బంపర్ హిట్ అయిన 'వేదాళం'ను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం మెగాస్టార్ గుండు లుక్తో కనిపించబోతున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికి కారణం అలాంటి ఫొటోను చిరు పోస్ట్ చేయడమే.
టాలెంటెడ్ డైరెక్టర్తో చిరు.. ప్రకటించేశాడుగా
తాను ఫ్యూచర్లో చేయబోయే సినిమాల జాబితాను గతంలోనే వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. అందుకు అనుగుణంగానే కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని 'ఉప్పెన' ఈవెంట్లో స్వయంగా వెల్లడించారాయన. ఇక, ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. కొత్త కథతోనే ఇది రూపొందబోతుంది.
భారీ మల్టీస్టారర్గా చిరంజీవి - బాబీ మూవీ
వరుస విజయాలతో దూసుకుపోతోన్న దర్శకుడు బాబీ.. లాక్డౌన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి ఓ లైన్ వినిపించాడు. అది ఆయనకు నచ్చడంతో పూర్తి కథను కూడా సిద్ధం చేసేశాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సాగనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని కూడ మల్టీస్టారర్గానే రూపొందించబోతున్నారట.
ఆ ఇద్దరు హీరోల్లో ఒకరు ఫిక్స్.. దాన్ని మించి
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అదే కుటుంబానికి చెందిన సాయి ధరమ్ తేజ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ నటించబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు మొదలయ్యే సమయానికి వీళ్లిద్దరిలో ఎవరైతే ఖాళీగా ఉంటారో.. వాళ్లనే ఇందులో నటింపజేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన మల్టీస్టారర్లను మించేలా ఇది ఉంటుందని టాక్.