Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Nagarjuna కోసం వైష్ణవ్ తేజ్ సాహసం.. మరే హీరో చేయని విధంగా.. అలాంటి రోల్ లో!
తెరంగ్రేటం చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా చేసిన మొదటి సినిమా ఓపెన్ ఎంత భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. ఈ సినిమా ఇచ్చిన భారీ బూస్ట్ తో ఆయన వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. నిజానికి వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా రిలీజ్ కాకముందే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిందని అంటున్నారు.
అందుకే వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు సినిమా యూనిట్. ఇక ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమా కూడా ప్రారంభించారు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాని తమిళంలో ఆదిత్య వర్మగా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో ఆయన మూడో సినిమా తెరకెక్కుతోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతానికి పూర్తయ్యాయి. కరోనా పరిస్థితి కుదుట పడితే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటికే వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా నాగార్జునకి చెందిన అన్నపూర్ణ బ్యానర్ కింద నిర్మిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోందని అంటున్నారు. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అంటే జనానికి ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ సినిమా హాకీ నేపథ్యంలో దొరికే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉండడంతో ఇప్పుడు ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో హాకీ నేపథ్యంలో పెద్దగా సినిమాలు రాలేదు. వచ్చిన ఏకైక సినిమా సందీప్ కిషన్ హీరోగా నటించిన ఏ వన్ ఎక్స్ప్రెస్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ఇలాంటి సమయంలో ఒక కొత్త హీరో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తూ ఉండడం ఒక ప్రయోగం అనే చెప్పాలని అంటున్నారు. మరి నాగార్జున కోసమే చేస్తున్నాడో లేక కధ నచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సాహసం చేస్తున్నాడు అని చెబుతున్నారు.