Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Nagarjuna కోసం వైష్ణవ్ తేజ్ సాహసం.. మరే హీరో చేయని విధంగా.. అలాంటి రోల్ లో!
తెరంగ్రేటం చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా చేసిన మొదటి సినిమా ఓపెన్ ఎంత భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. ఈ సినిమా ఇచ్చిన భారీ బూస్ట్ తో ఆయన వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. నిజానికి వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా రిలీజ్ కాకముందే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిందని అంటున్నారు.
అందుకే వికారాబాద్ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు సినిమా యూనిట్. ఇక ఇప్పటికే వైష్ణవ్ తేజ్ తన మూడో సినిమా కూడా ప్రారంభించారు. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాని తమిళంలో ఆదిత్య వర్మగా తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో ఆయన మూడో సినిమా తెరకెక్కుతోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతానికి పూర్తయ్యాయి. కరోనా పరిస్థితి కుదుట పడితే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటికే వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా నాగార్జునకి చెందిన అన్నపూర్ణ బ్యానర్ కింద నిర్మిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోందని అంటున్నారు. సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా అంటే జనానికి ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ సినిమా హాకీ నేపథ్యంలో దొరికే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉండడంతో ఇప్పుడు ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో హాకీ నేపథ్యంలో పెద్దగా సినిమాలు రాలేదు. వచ్చిన ఏకైక సినిమా సందీప్ కిషన్ హీరోగా నటించిన ఏ వన్ ఎక్స్ప్రెస్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ఇలాంటి సమయంలో ఒక కొత్త హీరో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తూ ఉండడం ఒక ప్రయోగం అనే చెప్పాలని అంటున్నారు. మరి నాగార్జున కోసమే చేస్తున్నాడో లేక కధ నచ్చిందో తెలియదు కానీ ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ సాహసం చేస్తున్నాడు అని చెబుతున్నారు.