Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ బోల్డ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైష్ణవ్ తేజ్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు ఒకే చేస్తున్నాడు. ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ అంతకుముందే క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను పూర్తి చేసిన విషయం తెలిసిందే. కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాకు జంగిల్ బుక్ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది.
అలాగే ఒకరిద్దరు దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్న వైష్ణవ్ తేజ్ త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఉప్పెన బజ్ పెరిగిన సమయంలోనే సీనియర్ నిర్మాత BVSN ప్రసాద్ కూడా వైష్ణవ్ తేజ్ డేట్స్ తీసేసుకున్నారు. ఇక అతని కోసం రెండు కథలపై గత కొంతకాలంగా చర్చలు జరిపిన ఆయన ఇటీవల ఒకటి ఫైనల్ చేసినట్లు సమాచారం.
ఇక ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది మరెవరో కాదు. అర్జున్ రెడ్డి కథను తమిళ్ లో రీమేక్ చేసిన గిరిసయ్య. ఆదిత్య వర్మ అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి అతని మేకింగ్ స్టైల్ ను నమ్మి మరోసారి అవకాశం ఇస్తున్నారు నిర్మాత. ఇదివరకే అతను సమంతతో ఒక త్రిల్లర్ సినిమాను చేయనున్నట్లు టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కోసం కథను రెడీ చేసినట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.