Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మహేశ్ బాబు లిస్ట్ నుంచి ఆ డైరెక్టర్ ఔట్: అందుకే అలా ప్లాన్ చేస్తున్నాడా!
చందమామ లాంటి రూపంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. 'రాజకుమారుడు' అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు దాదాపు పాతికేళ్లుగా ఇండస్ట్రీలో హవాను చూపిస్తున్నాడు. ఇక, ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఈ స్టార్ హీరో.. ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ పక్కాగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో భాగంగానే కొంత మంది దర్శకులను లైన్లో పెట్టుకున్నాడు. అయితే, తాజాగా ఆ జాబితా నుంచి ఒకరిని తీసేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం మహేశ్ బాబు.. పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి దీని కంటే ముందు అతడు తనకు 'మహర్షి' వంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో సినిమాకు కమిట్ అయ్యాడు. కొద్ది రోజుల్లో ఈ మూవీ పట్టాలెక్కుతుందన్న సమయంలో, అనివార్య కారణాలతో అది కాస్తా ఆగిపోయింది. స్క్రిప్ట్ విషయంలో మహేశ్ బాబు చెప్పిన మార్పులను వంశీ పూర్తి చేయలేకపోయాడన్న కారణంతోనే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్న టాక్ వినిపించింది.
అప్పుడు సినిమా ఆగిపోయినా.. ఫ్యూచర్లో మరోసారి వంశీతో మహేశ్ కలిసి చేస్తాడని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే 'సర్కారు వారి పాట' తర్వాత ఈ సినిమా ఉంటుందని భావించారు. కానీ, తాజా సమాచారం ప్రకారం.. ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలే లేవట. ప్రస్తుతం చేస్తున్న సినిమా అవగానే మహేశ్ బాబు.. త్రివిక్రమ్తో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. దాని తర్వాత రాజమౌళితో సినిమా ఉంటుంది. ఇవన్నీ అవ్వాలంటే దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుంది. దీంతో వంశీ వెబ్ సిరీస్లు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.