డైరక్టర్ వంశీ పైడిపల్లి నెక్ట్స్ ఏంటి

ఇక సంక్రాంతికి సందడి చేసిన చిత్రం 'ఎవడు'. రామ్చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించడంతో అభిమానులు ఆ చిత్రం గురించి ఆసక్తిగా ఎదురు చూశారు. ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చినా ఆదరణ పొందింది. కథానాయకులు కలిసి నటిస్తే తప్పకుండా ఫలితాలుంటాయని మరోసారి చాటి చెప్పిన చిత్రమిది. అల్లు అర్జున్ తెరపై కనిపించింది కాసేపే అయినా... ఇద్దరు మెగా కథానాయకులు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. అభిమానులు కూడా ఆనందించారు. 'ఎవడు' ప్రేక్షకుల ముందుకొచ్చి ఆదివారంతో యాభై రోజులయ్యాయి.
ఈ సందర్భంగా చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ''కథలో కొత్తదనంతో పాటు చరణ్, అల్లు అర్జున్ నటన చిత్రానికి బలాన్నిచ్చింద''ని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. ''మా సంస్థలో మరుపురాని చిత్రంగా నిలిచింది. ఇంటిల్లిపాదినీ అలరించేలా మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించామన్న తృప్తి కలిగింద''ని నిర్మాత దిల్రాజు చెప్పారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్, అమీజాక్సన్ కథానాయికలుగా నటించారు. కాజల్ కీలక పాత్రలో కనిపించింది.


Click it and Unblock the Notifications











