Don't Miss!
- News చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
డైరక్టర్ వంశీ పైడిపల్లి నెక్ట్స్ ఏంటి
ఇక సంక్రాంతికి సందడి చేసిన చిత్రం 'ఎవడు'. రామ్చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించడంతో అభిమానులు ఆ చిత్రం గురించి ఆసక్తిగా ఎదురు చూశారు. ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చినా ఆదరణ పొందింది. కథానాయకులు కలిసి నటిస్తే తప్పకుండా ఫలితాలుంటాయని మరోసారి చాటి చెప్పిన చిత్రమిది. అల్లు అర్జున్ తెరపై కనిపించింది కాసేపే అయినా... ఇద్దరు మెగా కథానాయకులు ఒకే సినిమాలో కనిపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. అభిమానులు కూడా ఆనందించారు. 'ఎవడు' ప్రేక్షకుల ముందుకొచ్చి ఆదివారంతో యాభై రోజులయ్యాయి.
ఈ సందర్భంగా చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ''కథలో కొత్తదనంతో పాటు చరణ్, అల్లు అర్జున్ నటన చిత్రానికి బలాన్నిచ్చింద''ని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. ''మా సంస్థలో మరుపురాని చిత్రంగా నిలిచింది. ఇంటిల్లిపాదినీ అలరించేలా మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించామన్న తృప్తి కలిగింద''ని నిర్మాత దిల్రాజు చెప్పారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్, అమీజాక్సన్ కథానాయికలుగా నటించారు. కాజల్ కీలక పాత్రలో కనిపించింది.