Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అల్లు అర్జున్కు నచ్చింది.. అరవింద్ ఓకే చెస్తే చాలు.. పిలుపు కోసం డైరెక్టర్ వెయిటింగ్
గత ఏడాది 'అల.. వైకుఠపురములో' అనే సినిమాతో కెరీర్లో తొలిసారి ఇండస్ట్రీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ తర్వాత అతడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఈ కారణంగానే వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇప్పటిక లెక్కల మాస్టారు సుకుమార్తో కలిసి 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా ఉండగానే అల్లు అర్జున్ 21వ చిత్రాన్ని టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నట్లు ప్రకటించాడు.
'పుష్ప'తో పాటు కొరటాల శివ రూపొందించనున్న సినిమా పెండింగ్లో ఉండగానే.. మరిన్ని చిత్రాలను లైన్లో పెట్టుకుంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇందులో భాగంగానే మరో స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కథా చర్చలు జరిపాడు. ఇది అతడికి బాగా నచ్చడంతో సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేసేశాడట ఈ స్టార్ హీరో. అదే సమయంలో తన తండ్రి, బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్కు కూడా ఓ సారి వినిపించమని చెప్పాడట. దీంతో వంశీ పైడిపల్లి.. అల్లు అరవింద్ పిలుపు కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నాడని ఫిలిం నగర్ ఏరియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి గతంలో మహేశ్ బాబుతో వంశీ పైడిపల్లి ఓ సినిమాను చేయాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. దీంతో ఈ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఆ స్టోరీని వినిపించాడు. అతడికి నచ్చినప్పటికీ వేరే ప్రాజెక్టుల కారణంగా ఇది చేయలేనని చెప్పేశాడు. ఇక, ఇప్పుడు ఇదే కథను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు సైతం వినిపించాడు వంశీ. మొదటి లైన్ దాటి ఇప్పుడీ బంతి అల్లు అరవింద్ కోర్టులో పడింది. ఆయన సిగ్నల్ వచ్చిన వెంటనే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మరి అప్పటి వరకూ వేచి చూడాల్సిందే.