Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వర్మ 'దొంగల ముఠా' ఐదు రోజుల షూటింగ్ నిజం కాదా?
రవితేజ, చార్మి కాంబినేషన్ లో రామ్ గోపాల్ వర్మ కేవలం ఐదు రోజుల్లో తీసానంటున్న 'దొంగలముఠా' విషయంలో కొత్త నిజం ఒకటి బయిటకు వచ్చింది. ఈ చిత్రం మొదటి ఆయన చెప్పినట్లుగా ఐదురోజుల్లో చుట్టేసినా ఆ తర్వాత రష్ చూసుకుని షాక్ అయిన వర్మ మళ్ళీ రీషూటింగ్ పెట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఐదు రోజుల్లో చుట్టేసిన ఆ రష్..చాలా గందరగోళంగా రావటంతో వెంటనే రీషూట్ ప్రారంబించాడని చెప్తున్నారు. మరో మూడు రోజుల పాటు మళ్ళీ సైలెంట్ గా రీషూట్ చేసి ఇప్పుడు విడుదలకు సిద్దం చేస్తున్నాడంటున్నారు. ఈ విషయమై నిర్మాత కూడా చాలా గుర్రుగా ఉన్నాడంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ..అప్పల్రాజు నిర్మించిన కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పల్రాజు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో ఈ చిత్రం విషయంలోనూ ఆయనకు అప్పుడే భయాలు మొదలయ్యాడని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా గురించి వర్మ... నాకు తెలిసి కెమెరామెన్ సరిగ్గా తీయలేకపోతే సినిమా ఆలస్యమవుతుంది. లేదంటే స్క్రిప్ట్ రెడీకాక పోవటం. నటీనటుల వల్ల ఆలస్యమనేది ఎప్పుడూ ఉండదు అన్నారు. " దొంగలముఠా" చిత్రం షూటింగ్ మొదటే చెప్పినట్లుగా కేవలం ఐదు రోజుల్లో ,కేవలం ఎనిమిది మంది క్రూ మెంబర్స్ తో దిగ్విజయంగా పూర్తి చేసారు. ఇది ఎంతవరకూ నిజమా అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.