Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వరుణ్ సందేశ్ 'కష్ట' కాలం
'హ్యాపీడేస్', 'కొత్తబంగారు లోకం' చిత్రాల వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న వరుణ్ సందేశ్ ఆ తర్వత వచ్చిన 'ఎవరైనా ఎపుడైనా' చిత్రం పరాజయం తర్వాత డీలా పడిపోయాడు. దీనికి తోడు పారితోషికాన్ని అమాంతం పెంచేసిన వరుణ్ ను తీసుకోవడానికి నిర్మాతలు వెనుకడుగేస్తున్నారు.
హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన వరుణ్ ఆ సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే నటించాడు. ఆ తర్వాత వచ్చిన 'కొత్తబంగారు లోకం' చిత్రానికి 15 లక్షల రూపాయలు పారితోషికంగా అందుకున్నాడు. ఇటీవలే విడుదలైన 'ఎవరైనా ఎపుడైనా' చిత్రానికి 20 లక్షలు తీసుకున్నాడని తెలిసింది. ఆ తర్వాతి సినిమాలకి ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేసాడట. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఒక్కసారిగా వరుణ్ క్రేజ్ పడిపోయింది. దీంతో వరుణ్ తో సినిమాలు చెయ్యాలనుకున్న నిర్మాతలు కొత్తగా వచ్చిన నాని, తనీష్ లను సంప్రదిస్తున్నారట. దీంతో వరుణ్ పారితోషికాన్ని 15 లక్షలకు తగ్గించకొని సినిమాలు చేస్తున్నాడట.