Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షాక్: రెండో సినిమాకే వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ పెంపు?
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి రీసెంటుగా వరుణ్ తేజ్ ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట.
https://www.facebook.com/TeluguFilmibeat
వరుణ్ తేజ్ రెండో సినిమా గీతా ఆర్ట్స్ బేనర్లో నిర్మాణం కానుంది. ‘ముకుంద' తర్వాత మరో రెండు సినిమాలు ఓకే అయ్యాయి. ఓ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు. అయితే ముందుగా క్రిష్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం అవుతుందని అంటున్నారు.
క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేయబోయే రెండో సినిమా నిర్మాణ బాధ్యతలు క్రిష్, అల్లు అరవింద్ గీతాఆర్ట్స్, డివివి దానయ్య భాగస్వాములుగా ఉంటారని సమాచారం. మెగా హీరోల రెండో సినిమాలో ‘గీతా ఆర్ట్స్' పాలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రామ్ చరణ్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్ చిత్రాల విషయంలో అదే జరిగింది. ఇపుడు వరుణ్ తేజ్ విషయంలో కూడా ఇదే సెంటిమెంట్ ఫాలోఅవుతున్నారని టాక్.
వరుణ్ తేజ్ తొలి సినిమా ‘ముకుంద' ఆశించిన ఫలితాలు ఇవ్వని నేపథ్యంలో అతని రెండో సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నాగబాబు. ఈ సారి సినిమా పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ మాస్ ఎంటర్టెనర్గా రాబోతోందని తెలుస్తోంది.