రామ్ చరణ్,క్రిష్ కాంబినేషన్ చిత్రం ఆ కథతోనేనా?
రామ్ చరణ్, క్రిష్ కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం ప్రారంభంకానుందనే సంగతి తెలిసిందే.అయితే ఆ చిత్రం మరేదో కాదు...ఇంతకుముందు వెంకటేష్ కోసం సంవత్సరం పాటు కూర్చుని తయారుచేసిన కృష్ణం వందే జగద్గురం చిత్రమేనంటున్నారు. అప్పట్లో సురేష్ బాబు, అశ్వనీదత్ కలిసి ఆ చిత్రం నిర్మిద్దామని ప్లాన్ చేసారు. రంగ్ దే బసంతి తరహాలో జరిగే కథగా ఈ చిత్రం రూపొందనుందని వార్తలు వచ్చాయి. అయితే కథ తృప్తి చెందకపోవటంతో ఆ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు.దాంతో వేదం సినిమాముందుకొచ్చింది.వేదం రిలీజయ్యాక అదే సినిమా తమిళ వెర్షన్ ఆఫర్ క్రిష్ కి రావటంతో అటు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సినిమా పూర్తి చేసి, తనదగ్గరున్న కథని రామ్ చరణ్ కి నేరేట్ చేయటంతో వెంటనే ఓకే చేసాడని తెలుస్తోంది. మెరుపు చిత్రం అనంతరం ఈ సినిమా ప్రారభం కానుంది.
More from Filmibeat
రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ వేదం గమ్యం మెరుపు ఆరెంజ్ క్రిష్ ram charan teja orange merupu krishna vamsi gamyam allu arjun krish


Click it and Unblock the Notifications











