Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! ఢిల్లీ నుంచి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
వెంకీ చంద్రముఖీ-2 సెంటిమెంటుతో వాయిదా..
పి వాసు దర్శకత్వంలో కన్నడంలో ఘన విజయం సాధించిన 'ఆప్తమిత్ర' సినిమాకు సీక్వెల్ గా తెలుగులో వెంకటేష్ చేస్తున్నాడు. దాదాపు సగం సినిమా షూటింగ్ పూర్తయిందని టాలీవుడ్ సమాచారం. క్లైమాక్స్ రామానాయుడు స్టూడియోలో చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. వెంకీ, అనుష్క, రిచా గంగోపాద్యాయతో క్లైమాక్స్ ను రామోజి ఫల్మి సిటిలో పూర్తి చేసి తర్వాత షెడ్యూల్ జైపు్ర్ షూటింగ్ తో సినిమా పూర్తి అవుతుందిని సమాచారం.
అయితే బుధవారం నానక్ రామ్ గూడలో షూటింగ్ జరుగుతుండగా డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బాలరాజ్ చనిపోయాడు. దాంతో యూనిట్ కు సెంటిమెంట్ గుర్తుకు వచ్చింది. హీరో వెంకటేష్ షూటింగ్ ను కాన్సిల్ చేశాడు. భవిష్యత్లో ఇంకా ఏమి జరుగుతుందోనని నిర్మాతలు కంగారుపడుతున్నారు. వెంకీ సినిమాలో సెంటిమెంటు ఎక్కువుగా ఉండటం చూసాం, కానీ సినిమా షూటింగ్ అప్పుడు కుడా సెంటిమెంటు చూడడం వింతగా ఉంది కదూ!