Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రాజకీయ కారణాల వల్లే...వెంకటేష్ మార్చారు
హైదరాబాద్: సుమారు సంవత్సరం క్రితం వెంకటేష్ ఓ కథను ఓకే చేసారు. అయితే ఇన్నాళ్ళకా ప్రాజెక్టు మెటీరియలైజ్ అవుతోంది. ఆ సినిమా మరేదో కాదు...మారుతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం. ఈ చిత్రానికి రాధా అనే టైటిల్ పెడదామనుకున్నారు. అయితే కొన్ని రాజకీయ కారణాలతో ...విజయవాడకు చెందిన ఓ పొలిటీషియన్ కథ గా భ్రమపడే అవకాసం ఉందని , అనవసరమైన కాంట్రవర్శలకు దారి తీస్తుంది కాబట్టి అలాంటి వద్దనుకున్నట్లు సమాచారం. దాంతో రాధా, రాధ కిృష్ణా టైటిల్స్ అనుకున్నా చివరకు 'బాబు బంగారం' ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
మొదట నుండి వెంకిని ఇండస్ట్రీలో అందరూ బాబు అని పిలుస్తుండటం కూడా ఈ చిత్రానికి ఈ పేరు బాగుంటుందని ఫైనల్ చేసినట్లు చెప్పుకుంటున్నారు. వెంకటేష్ సైతం ఈ టైటిల్ బాగుంటుందనే బావన వ్యక్తం చేసినట్లు సమచారం.
చిత్రం విశేషాలకు వస్తే... వెంకటేశ్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం డిసెంబర్ 16న ప్రారంభం కానుందని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. ఎస్. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని నాగవంశీ తెలియజేస్తూ ‘‘ఇదివరకు ‘లక్ష్మీ', ‘తులసి' చిత్రాలతో హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న వెంకటేశ్, నయనతార మరోసారి మా చిత్రంలో జంటగా నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇటీవల మారుతి చెప్పిన కథ మాకు, వెంకటేష్ గారికి బాగా నచ్చింది. వారి కాంబినేషన్ సినిమా అనగానే షూటింగ్ ప్రారంభానికి ముందుగానే క్రేజ్ వచ్చింది.
ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. తెలుగులో ‘రన్ రాజా రన్', ‘జిల్' సినిమాలకు పనిచేసిన జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వివేక్ ఆనంద్, కూర్పు: ఉద్దవ్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ
ఈ చిత్రానికి బాబు బంగారం అనే టైటిల్ ఫైనల్ చేయాల్సి ఉన్నా ఆ చిత్రాన్ని 2016 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తెస్తాం'' అని చెప్పారు.