Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
22 ఏళ్ల క్రితం.... అప్పటి నుండి వెంకీ- రోజా కటీఫ్, ఏం జరిగిందంటే?
Recommended Video
తెలుగు అగ్రహీరోల్లో ఒకరైన వెంకటేష్ అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజాతో కలిసి చాలా సినిమాలు చేశారు. అయితే వీరి మధ్య 22 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన ఇద్దరి మధ్య లింక్ కట్ అయ్యేలా చేసిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరి మధ్య అసలు మాటలే లేవు. తాజాగా ఓ టీవీ ఛానల్ వారు ఈ విషయాన్ని తెరపైకి తేవడంతో ఆ సంఘటన గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది.
వెంకీతో రోజా సినిమా ప్రయత్నం విఫలం
రోజా తన భర్త సెల్వమణి తో కలిసి వెంకటేష్ హీరోగా, తాను హీరోయిన్ గా ‘చినరాయుడు' టైటిల్ తో ఓ సినిమా తీద్దామనుకున్నారట. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాలేదనిసమాచారం.
వెంకీ అలా చేయడంతో రోజాకు కోపం వచ్చింది
అయితే అదే చిత్ర కథాంశంతో విజయశాంతితో కలిసి వెంకటేష్ ‘చినరాయుడు' చిత్రంలో నటించారు. దాంతో రోజాకు కోపం వచ్చిందట. ఇలా చేశావేంటి అని వెంకటేష్ను రోజా అప్పట్లో నిలదీసిందట. అదంతా నిర్మాతల నిర్ణయమని, తన ప్రమేయం లేదంటూ జారుకున్నారట వెంకటేష్.
బాంబే హోటల్లో మూడు రోజులు ఉంచడంతో
తర్వాత కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ‘పోరికి రాజా' అనే చిత్రం వెంకటేష్-రోజా కాంబినేషన్లో వచ్చింది. ఈచిత్రం షూటింగ్ కోసం రోజాను బాంబే తీసుకెళ్లి మూడు రోజుల పాటు ఏ షూటింగ్ లేకుండా హోటల్లో ఖాళీగా ఉంచారట. ఏంటని అడిగితే దర్శక నిర్మాతల నుండి సరైన సమాధానం రాలేదట.
ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన రోజా
మూడు
రోజులు
ఖాళీగా
ఉన్న
రోజా
తన
భర్త
సెల్వమణి
బర్త్
డే
అని
చెప్పి
ఎవరికీ
చెప్పకుండా
చెన్నై
వెళ్లిపోయిందట.
4వ
రోజు
నుండి
షూటింగ్
ప్లాన్
చేసుకున్న
నిర్మాతలు
రోజా
చేసిన
పనికి
షాకయ్యారట.
మీరు
వస్తే
షూటింగ్
కంప్లీట్
చేసుకుంటామని
చిత్ర
బృందం
ఎంత
చెప్పినా
రోజా
వినలేదట.
వెంకీ స్వయంగా ఫోన్ చేశాడు
స్వయంగా వెంకటేష్ ఫోన్ చేసి మాట్లాడినా రోజా వినలేదని, తర్వాత రోజా స్వయంగా వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లిందని. అప్పటి నుండి ఇప్పటి వరకు రోజా- వెంకటేష్ మధ్య మాటలు లేవని టాక్. ఈ విషయం ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలియదట.