Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెంకటేష్-మారుతి చిత్రం టైటిల్ మారింది
హైదరాబాద్ :వెంకటేష్, మారుతి కాంబినేషన్ లో ఆ మధ్యన ఓ ప్రాజెక్టు చివరిదాకా వెళ్లి కథ కాపీ వివాదంతో కంచికి వెళ్లింది. అయితే మారుతి తాజాగా భలే భలే మొగాడివోయ్ అంటూ సూపర్ హిట్ చిత్రం ఇచ్చాక మళ్లీ ఈ ప్రాజెక్టు ఎక్కటానికి రంగం సిద్దమైంది. సితార క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'రాధ' అనే సినిమా ఎనౌన్స్ అయి ఆగిపోయింది. ఆ తరువాత మరోసారి వెంకీని తన కథతో మెప్పించిన మారుతి డిసెంబర్ చివరివారంలో కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో వెంకీ జోడిగా నయనతార నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి టైటిల్ గా... 'రాధాకృష్ణ ' అని పెట్టాడని తెలుస్తోంది.
'గోపాల గోపాల' సినిమా తరువాత తన తదుపరి ప్రాజెక్టును ఫైనల్ చేయటానికి చాలా టైం తీసుకున్నాడు వెంకటేష్. సీనియర్ డైరెక్టర్ల నుంచి కొత్త దర్శకుల వరకు చాలామంది కథలు విన్న విక్టరీ హీరో ఫైనల్ గా ఈ యువ దర్శకుడికు ఓకే చెప్పాడు.
కొద్ది రోజులుగా మళయాల సినిమా 'భాస్కర్ ది రాస్కెల్' రీమేక్లో నటిస్తాడంటూ వార్తలు వినిపించటంతో మారుతి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం , స్ట్రయిట్ సినిమానా లేక రీమేక్ అన్న విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.