Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'డైమండ్ రాజా' గా వెంకటేష్
హైదరాబాద్: వెంకటేష్ త్వరలో 'డైమండ్ రాజా' గా కనిపించనున్నారని తెలుస్తోంది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ఈ టైటిల్ ని ఫైనలైజ్ చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. మొదట ఈ చిత్రానికి రాధాకృష్ణ అనే టైటిల్ అనుకున్నారు కానీ నిర్మాత మీడియా వద్ద ఖండించారు.
ఇక డైమండ్ రాజా నే కాక రాజా రత్నం, 24 క్యారెట్ బంగారం, బాబు బంగారం, టైటిల్స్ కూడా ఈ చిత్రం టైటిల్స్ గా పరిగణనలోకి తీసుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, సురేష్ బాబు ఏ టైటిల్ ఫైనలైజ్ చేస్తే అదే టైటిల్ తో సినిమా మొదలు కానుంది.
చిత్రం విశేషాలకు వస్తే... వెంకటేశ్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం డిసెంబర్ 16న ప్రారంభం కానుందని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. ఎస్. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని నాగవంశీ తెలియజేస్తూ ‘‘ఇదివరకు ‘లక్ష్మీ', ‘తులసి' చిత్రాలతో హిట్ పెయిర్గా పేరు తెచ్చుకున్న వెంకటేశ్, నయనతార మరోసారి మా చిత్రంలో జంటగా నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇటీవల మారుతి చెప్పిన కథ మాకు, వెంకటేష్ గారికి బాగా నచ్చింది. వారి కాంబినేషన్ సినిమా అనగానే షూటింగ్ ప్రారంభానికి ముందుగానే క్రేజ్ వచ్చింది.
ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. తెలుగులో ‘రన్ రాజా రన్', ‘జిల్' సినిమాలకు పనిచేసిన జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 2016 వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తాం'' అని చెప్పారు.
జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వివేక్ ఆనంద్, కూర్పు: ఉద్దవ్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ