Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
వెంకటేష్ నెక్స్ట్ చిత్రంలో మానసిక వికలాంగుడిగా..
వెంకటేష్ తాజా చిత్రం నాగవల్లి ఫ్లాప్ కావటంతో చాలా నిరాశలో ఉన్నాడని చెప్తున్నారు. దాంతో తాను తర్వాత చేయబోయే చిత్రం స్క్రిప్టు పకడ్బందీగా ఉండాలి, గ్యారెంటీ హిట్ పడాలని తన సోదరుడు సురేష్ బాబుకు మరీ మరీ చెప్తున్నాడు. దాంతో ముందు ప్రక్కన పెట్టిన సావిత్రి స్క్రిప్టుని మళ్ళీ మొదలెట్టారని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేష్ ఓ విభిన్నతరహా పాత్రను చేయనున్నాడని, మెంటల్లీ చాలెంజెడ్ పాత్ర అని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇక ఆ పాత్ర కోసం కొద్ది రోజుల పాటు అలాంటి వ్యక్తులను దగ్గరగా పరిశీలంచాలని కూడా వెంకటేష్ భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక త్రివిక్రమ్ చిత్రం బడ్జెట్ పరంగా బాగా ఎక్కువగా ఉండటంతో మరోసారి విని చేద్దామనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ఖలేజా అనంతరం త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమాని యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండాలని అనుకంటే వెంకటేష్ మాత్రం నువ్వు నాకు నచ్చావ్ తరహా రొమాంటిక్ కామిడీగా ఉండాలని స్పంష్టం చేసినట్లు సమాచారం. దాంతో ఆ స్క్రిప్టు లేటు అయ్యేటట్లు ఉందని వెంటనే సావిత్రిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. సావిత్రి చిత్రాన్ని కేక వంటి డిజాస్టర్ చిత్రం అందించిన తేజ డైరక్ట్ చేయనున్నాడు.