దర్శకుడు దశరధ్ నెక్ట్స్ చిత్రం ఆ హీరోతో కన్ఫర్మ్..డిటేల్స్
మిస్టర్ ఫర్ ఫెక్ట్ హిట్టుతో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిన దర్శకుడు దశరధ్. ఆయన తాజాగా మరో చిత్రం కమిటయ్యారు. వెంకటేష్ హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి ఆయన త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. సింహా నిర్మాతలు పరుచూరి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. దాంతో దశరధ్ చిత్రం స్క్రిప్టు వర్క్ లో బిజీగా ఉన్నారు.సంక్రాంతికి విడుదల అయ్యేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.ఇక వెంకటేష్ ప్రస్తుతం బాడీగార్డు రీమేక్ లో బిజీగా ఉన్నారు.త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రాన్ని గోపీచంద్ మలినేని డైరక్ట్ చేస్తున్నారు. అలాగే సింహా నిర్మాతలు రాణా హీరోగా నా ఇష్టం చిత్రం నిర్మిస్తున్నారు. సుకుమార్ అశోశియేట్ ప్రకాష్ తోలేటి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఆ చిత్రం రూపొందనుంది. జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











