Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘ఓమైగాడ్’ తెలుగు రీమేక్ ఖరారు...డిటేల్స్
ప్రకారం....ఇటీవలే వెంకటేష్ 'ఓ మై గాడ్' చిత్రం చూసాడని, స్టోరీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడని, ఆ చిత్రంలో అక్షయ్ కుమార్ మాదిరి లార్డ్ శ్రీకృష్ణ పాత్ర చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈచిత్రంలో లవ్ స్టోరీ, ఫైట్స్ తక్కువగా ఉండటం, కథ ఆకట్టుకునే విధంగా ఉండటంతో అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వడంతో పాటు, మెప్పిస్తుందని వెంకటేష్ భావిస్తున్నాడట. అయితే ఈచిత్రం విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. త్వరలోనే ఈ మూవీపై క్లారిటీ రానుంది.
పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.
'ఓ మై గాడ్'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.
భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'ఓ మై గాడ్'లో అక్షయ్ ఆధునిక శ్రీకృష్ణునిగా కనిపించాడు. పరేష్రావల్ ఓ కీలక పాత్ర చేసిన ఈ సినిమాని అశ్వనీ యార్ది దర్శకత్వం వహించగా గ్రేజింగ్ గోట్బ్యానర్పై అక్షయ్ స్వయంగా నిర్మించాడు. ఈ కథ ప్రధానంగా నాస్తికుడిగా నటిస్తున్న పరేష్రావల్ చుట్టూ నడుస్తుంది. ఓ కేసు విషయమై అతను శ్రీకృష్ణుడిని ఎలా కోర్టుకి లాగుతాడు, కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడన్నది కథ. ఓ గుజరాతీ నాటకం దీనికి ఆధారం. తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి నిర్మాత కృష్ణప్రసాద్ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఆయనతో పాటు అక్షయ్, యార్ది కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశా లున్నాయి.