Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెంకటేష్,రామ్ కాంబినేషన్ లో మల్టి స్టారర్
హైదరాబాద్ : త్వరలో మరో మల్టి స్టారర్ ప్రారంభం కాబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. వెంకటేష్ , రామ్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. హిందీ చిత్రం బోల్ బచ్చన్ రీమేక్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రం రైట్స్ తీసుకుని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. గతంలో ఇదే బ్యానర్ లో చేసిన ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరెకెక్కించటానికి సంసిద్దమవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాసముంది.
బోల్ బచ్చన్ లో అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, అసిన్, ప్రచీ దేశాయ్, అస్రానీ, అర్చనా పూరణ్సింగ్ తదితరులు నటించారు. సంగీతం హిమేష్ రేషమ్మియా అందించారు.'గోల్ మాల్' సిరీస్ హిట్ కామెడీలు తీస్తున్న దర్శకుడు రోహిత్శెట్టి డైరక్ట్ చేసారు. హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. అయితే ఈ చిత్రం హృషికేశ్ ముఖర్జీ హిట్ 'గోల్ మాల్' (1979) కి రీమేక్ కావటం విశేషం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్,పంచ్ డైలాగ్స్ తో ఈ చిత్రం నవ్విస్తూ సాగుతుంది. బాలీవుడ్ లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇక ప్రస్తుతం..రామ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా లిమిటెట్ పతాకంపై 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'ఒంగోలు గిత్త' చిత్రం చేస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నఈ చిత్రం ఫ్యామిలీ టచ్తో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. గుంటూరు మార్కెట్ యార్డ్లో, హైదరాబాద్లో రెండు షెడ్యూల్స్ జరిగాయి. ప్రస్తుతం తణుకులో షూటింగ్ జరుగుతోంది. నవంబర్ 15 వరకూ జరిగే షెడ్యూల్తో రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తవుతుంది.
డిసెంబర్లో 'ఒంగోలు గిత్త' సినిమాను విడుదల చేస్తారు. రామ్ ఇమేజ్కి తగినట్లుగా ఎనర్జిటిక్గా ఉంటుంది. ప్రకాష్రాజ్ పాత్ర హైలైట్గా ఉంటుంది. మార్కెట్ యార్డ్ నేపథ్యంలో జరిగే కథ ఇది' అని నిర్మాత అంటున్నారు. కృతి కర్బందా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అభిమన్యుసింగ్, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ఇతర ముఖ్యతారాగణం. ఈ చిత్రానికి పాటలు: వనమాలి, సంగీతం: జి.వి. ప్రకాష్కుమార్, ఫొటోగ్రఫీ: వెంకటేశ్, సమర్పణ: భోగవల్లి బాపినీడు, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: భాస్కర్.