Don't Miss!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- News Arvind Kejriwal: బెయిల్ కోసం కేజ్రీవాల్ పాట్లు, జైల్లో అవి తింటున్నారట!!
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వెంకటేష్, తేజ కాంబినేషన్ 'సావిత్రి' ఆగినట్లే!?
కేక వంటి డిజాస్టర్ ని అందించిన తేజ దర్శకత్వంలో వెంకటేష్ .."సావిత్రి" అనే టైటిల్ తో ఓ చిత్రాన్ని ప్రారింబించబోతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ చిత్రం అటకెక్కినట్లేనని వినపడుతోంది. అసలే ప్లాపుల్లో ఉన్న తాను ప్రయోగాత్మక చిత్రాల్లో చేయటం ఇష్టం లేదని వెంకటేష్ స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. అందుకునే వెంకటేష్ ఇన్నాళ్ళూ ప్రక్కన పెడుతూ వచ్చిన బాడీగార్డు రీమేక్ కి పచ్చజెండా ఊపారని, బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేని కి అప్పచెప్పటంతో హ్యాపీ ఫీలయ్యాడని చెప్తున్నారు. అయితే సురేష్ బాబు కూడా తేజ రూపొందించిన కథలో ఇన్వాల్స్ కావటంతో ప్రాజెక్టు ఆగే అవకాశం లేదని, కొద్దిగా లేటయినా సినిమా మొదలవ్వటం గ్యారెంటీ అని చెప్తున్నారు. సురేష్ బాబుకి ఇలా ప్రాజెక్టులు నాన్చటం అలవాటేనని, త్వరగా నిర్ణయం తీసుకోడని గతంలో ఆ క్యాంపస్ లో పనిచేసినవారు అంటూంటారు. అది నిజం కాబట్టే దాదాపు రెండున్నర ఏళ్ళుగా తేజ స్క్రిప్టుని అలా పెండింగ్ లో పెట్టాడని అంటున్నారు. అంతకు ముందు కూడా అమ్మరాజశేఖర్ తో గంగ ...ది డాన్ అనే చిత్రం ప్రకటించి ప్రక్కనపెట్టాడని, సెల్వ రాఘవన్ వంటి దర్శకుడుతో రానా హీరోగా ప్రారంభించిన సినిమా కూడా అలాగే కొద్దిరోజులు నడిపి ఆపుచేసాడు కాబట్టి ఈ తేజ,వెంకటేష్ కాంబినేషన్ విషయంలోనూ ఏమీ చెప్పలేమని అంటున్నారు.