Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంకటేష్ కే ఎక్కువ పే చేస్తున్నారు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)లో తెలుగు వారియర్స్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ గ్రూపుకు కెప్టెన్ గా వెంకటేష్ వ్యవహిస్తున్నారు. ఇక వెంకటేష్ మాత్రమే ఈ పోటీల్లో ఎక్కవ రెమ్యునేషన్ అందుకున్న స్టార్ అని ఓ ఇంగ్లీష్ దిన పత్రిక రాసుకొచ్చింది. కోటి పాతిక లక్షలు వెంకటేష్ కు అందచేసారని తెలియచేసింది. అయితే తెలుగు వారియర్స్ కొత్త సహ యజమానులు ఎమ్ ఆర్ గ్రూప్ మాత్రం ఈ విషయంలో ఎక్కువ మాట్లాడటానికి ఆసక్తి చూపటం లేదు. అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేస్తోంది. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)లో పాల్గొన్న సూర్య,మోహన్ లాల్, శరత్ కుమార్,సుదీప్ ల కన్నా వెంకటేష్ రెమ్యునేషన్ మాత్రమే ఎక్కువ అవటం అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఇక తెలుగు వారియర్స్ లో వెంకటేష్ మాత్రమే సూపర్ స్టార. మంచు విష్ణు,సిద్దార్ధ వంటి స్టార్స్ ఉన్నా వెంకటేష్ కే ఫాలోయింగ్ ఎక్కువ అవటంతో ఈ రేంజి రెమ్యునేషన్ ఆఫర్ చేసారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం సంక్రాంతికి విడుదలై విజయం సాధించటంతో హ్యాపీగా ఉన్నారు. మరోప్రక్క మెహర్ రమేష్ దర్శకత్వంలో సింహా నిర్మాత ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు మహేష్ కాంబినేషన్ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేస్తున్నారు.