Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
వెంకటేష్ కే ఎక్కువ పే చేస్తున్నారు
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)లో తెలుగు వారియర్స్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ గ్రూపుకు కెప్టెన్ గా వెంకటేష్ వ్యవహిస్తున్నారు. ఇక వెంకటేష్ మాత్రమే ఈ పోటీల్లో ఎక్కవ రెమ్యునేషన్ అందుకున్న స్టార్ అని ఓ ఇంగ్లీష్ దిన పత్రిక రాసుకొచ్చింది. కోటి పాతిక లక్షలు వెంకటేష్ కు అందచేసారని తెలియచేసింది. అయితే తెలుగు వారియర్స్ కొత్త సహ యజమానులు ఎమ్ ఆర్ గ్రూప్ మాత్రం ఈ విషయంలో ఎక్కువ మాట్లాడటానికి ఆసక్తి చూపటం లేదు. అవన్నీ రూమర్స్ అని కొట్టి పారేస్తోంది. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)లో పాల్గొన్న సూర్య,మోహన్ లాల్, శరత్ కుమార్,సుదీప్ ల కన్నా వెంకటేష్ రెమ్యునేషన్ మాత్రమే ఎక్కువ అవటం అంతటా చర్చనీయాంశంగా మారింది.
ఇక తెలుగు వారియర్స్ లో వెంకటేష్ మాత్రమే సూపర్ స్టార. మంచు విష్ణు,సిద్దార్ధ వంటి స్టార్స్ ఉన్నా వెంకటేష్ కే ఫాలోయింగ్ ఎక్కువ అవటంతో ఈ రేంజి రెమ్యునేషన్ ఆఫర్ చేసారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వెంకటేష్ బాడీగార్డ్ చిత్రం సంక్రాంతికి విడుదలై విజయం సాధించటంతో హ్యాపీగా ఉన్నారు. మరోప్రక్క మెహర్ రమేష్ దర్శకత్వంలో సింహా నిర్మాత ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటితో పాటు మహేష్ కాంబినేషన్ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేస్తున్నారు.