మెగా మేనల్లుడి న్యూ స్టెప్.. మేనల్లుడా మజాకా.. వెరీ ఇంట్రెస్టింగ్
వరుసగా ఆరు సినిమాలు డిజాస్టర్ అయినా ఏ మాత్రం పట్టుసడలని మెగా మేనల్లుడు ''చిత్రలహరి, ప్రతీ రోజు పండగే'' సినిమాలతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా సెట్స్పై చురుకుగా కదులుతున్న ఆయన.. దేవాకట్టా దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యాడు.
ప్రస్థానం సినిమాతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవకట్టా.. అదే సినిమాను హిందీలోకి రీమేక్ చేసి ప్రశంసలు అందుకున్నాడు. మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత మెగా హీరో సాయితేజ్ కథానాయకుడిగా ఓ సినిమాను రూపొందించబోతున్నాడు. నిన్న (గురువారం) ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరై క్లాప్ కొట్టారు.

ఈ సినిమా దేవకట్టా శైలిలోనే ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కబోతోందట. జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. జగపతిబాబు, రమకృష్ణ పాత్రలు పోషించనున్నారు. మణిశర్మ సంగీతం అందించబోతున్నారు.
అయితే తాజా సమాచారం మేరకు ఈ మూవీకి 'మేనల్లుడా మజాకా' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని తెలుస్తోంది. గతంలో సాయి ధరమ్ తేజ్ మేనమామ చిరంజీవి 'అల్లుడా మజాకా' అంటూ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు 'మేనల్లుడా మజాకా' రూపంలో భారీ హిట్ పట్టాలని ఇలా ప్లాన్ చేశారట యూనిట్ సభ్యులు.


Click it and Unblock the Notifications











