Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విద్యాబాలన్,ప్రభాస్ గెస్ట్ లుగా ఆడియో పంక్షన్...
అలాగే విద్యాబాలన్తో పాటు మరో అతిథిగా ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరవ్వనున్నారని సమాచారం. ఈ సందర్భంగా సహ నిర్మాత సత్య ముమ్మడి మాట్లాడుతూ-''ప్రియమణి కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఇది. అశోక్గజపతిరాజుగా కృష్ణంరాజు పాత్ర ఈ చిత్రానికి హైలైట్. మరో శక్తిమంతమైన పాత్రలో తమిళ హీరో శరత్కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. సినిమా సాధించబోయే విజయానికి ప్రతీకగా ఆగస్ట్ 12న ఆడియో జరుపనున్నాం'' అని తెలిపారు.
వి.సముద్ర దర్శకత్వంలో డా.శ్రీనుబాబు.జి నిర్మిస్తున్న 'చండి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఎస్.ఆర్.శంకర్, చిన్న సంయుక్తంగా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గ్రాండ్గా విడుదల చేయడానికి నిర్మాత శ్రీనుబాబు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రియమణి ప్రధాన పాత్రలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో...ఆశిష్ విద్యార్థి, వినోద్కుమార్, నాగబాబు, అలీ, రంగనాథ్, పోసాని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి.బాబ్జీ, సమర్పణ: జి.జగన్నాథనాయుడు.