twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విద్యాబాలన్,ప్రభాస్ గెస్ట్ లుగా ఆడియో పంక్షన్...

    By Srikanya
    |

    హైదరాబాద్ బాలీవుడ్ భామ విద్యాబాలన్... త్వరలో ఓ ఆడియో పంక్షన్ నిమిత్తం హైదరాబాద్ రానుందని సమాచారం. ప్రియమణి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న 'చండి' చిత్రం ఆడియో వేడుక ఆగస్ట్ 12న జరుగనుంది. ఈ వేడుకకు ఈ 'డర్టీ పిక్చర్' హీరోయిన్.. అతిథిగా రానున్నారని చెప్తున్నారు. విద్యాబాలన్, ప్రియమణి ఇద్దరూ కజిన్స్ అవటంతో ఆమె రావటానికి ఓకే చేసిందని తెలుస్తోంది.

    అలాగే విద్యాబాలన్‌తో పాటు మరో అతిథిగా ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరవ్వనున్నారని సమాచారం. ఈ సందర్భంగా సహ నిర్మాత సత్య ముమ్మడి మాట్లాడుతూ-''ప్రియమణి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఇది. అశోక్‌గజపతిరాజుగా కృష్ణంరాజు పాత్ర ఈ చిత్రానికి హైలైట్. మరో శక్తిమంతమైన పాత్రలో తమిళ హీరో శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. సినిమా సాధించబోయే విజయానికి ప్రతీకగా ఆగస్ట్ 12న ఆడియో జరుపనున్నాం'' అని తెలిపారు.

    వి.సముద్ర దర్శకత్వంలో డా.శ్రీనుబాబు.జి నిర్మిస్తున్న 'చండి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎస్.ఆర్.శంకర్, చిన్న సంయుక్తంగా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత శ్రీనుబాబు సన్నాహాలు చేస్తున్నారు.

    ప్రియమణి ప్రధాన పాత్రలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో...ఆశిష్ విద్యార్థి, వినోద్‌కుమార్, నాగబాబు, అలీ, రంగనాథ్, పోసాని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి.బాబ్జీ, సమర్పణ: జి.జగన్నాథనాయుడు.

    English summary
    Priyamani starrer Chandi's audio will be launched on 12th August. Popular Bollywood actress Vidya Balan and Tollywood's actor Prabhas will be guests for the audio launch, the makers said in a statement. The makers are planning to make the audio launch a grand affair. Chandi is touted to be an action entertainer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X