Don't Miss!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రొమాన్స్ చేయడానికి ఆమె కావాలి.. ఆ హీరోయిన్ తీసుకురమ్మని విజయ్ దేవరకొండ!
Recommended Video
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సక్సెస్ల తర్వాత సూపర్ పవర్స్టార్ విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మారిపోయాడు. బాక్సాఫీస్ వద్ద స్టార్ స్టామినా పెరిగింది. కెరీర్ గ్రాఫ్ తారాజువ్వలా దూసుకుపోయింది. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. త్వరలో మైత్రీ మూవీస్ రూపొందించే ఓ సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపికపై సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. అదేమిటంటే..
పోల్: బిగ్బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!
మైత్రీ మూవీస్ బ్యానర్లో విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీస్ రూపొందించే చిత్రంలో హీరోయిన్ది కీలకపాత్రనట. గ్లామర్, రొమాంటిక్ పాళ్లు ఎక్కువేనట. ఆ పాత్ర కోసం దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ అయితే బాగుంటుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నారట. తన ఆలోచనను నిర్మాతలతో పంచుకోగా.. ఆమె ఒప్పుకుంటుందా? అనే విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయట.
జాహ్నవి కపూర్ కోసం ట్రయల్స్
అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన పేరు చెబితే జాహ్నవి తప్పకుండా ఒప్పుకుంటుంది. తనతో నటించడానికి ఒకే చెబుతుంది అనే ధీమాతో ఉన్నారట. అదే విషయాన్ని నిర్మాతలకు చెప్పి..ఆమెను ఒప్పించాలని సూచించారట. ఇంతకీ జాహ్నవి ఒప్పుకుంటుందా లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది.
ధడక్ సక్సెస్ జోష్తో
ధడక్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి జాహ్నవి సక్సెస్ జోష్లో ఉంది. కరణ్ జోహర్ రూపొందించే చారిత్రాత్మక చిత్రం తఖ్త్లో నటించేందుకు ఒప్పుకొన్నది. ఆ తర్వాత ఏ సినిమాను ఒప్పుకొన్న దాఖలాలు కనిపించడం లేదు.
అక్టోబర్ 5న నోటా రిలీజ్
గీత గోవిందం తర్వాత తమిళ, తెలుగులో రూపొందుతున్న నోటా చిత్రం అక్టోబర్ 5న విడుదలకు సిద్దమవుతున్నది. ఆనంద శంకర్ రూపొందించే చిత్రంలో మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తున్నది. అలాగే డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో కూడా విజయ్ నటిస్తున్నాడు.