Don't Miss!
- Finance Telecom News: వినియోగదారులకు టెలికాం కంపెనీల వాత.. ముహూర్తం ఫిక్స్..
- News rasi phalalu today: ఈ రాశులవారు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ప్రభాస్ ‘సలార్’లో విలన్గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
తెలుగు సినిమా హీరోగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అయితే అది గతం.. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తున్నాడతను. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి తన స్టామినాను విశ్వవ్యాప్తం చేసుకున్న అతడు.. వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లోనే నటిస్తూ సత్తా చాటుతున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో 'సలార్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మరో స్టార్ హీరో విలన్గా చేస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!
బాహుబలి తర్వాత సాహో అంటూ వచ్చి
కొన్నేళ్ల క్రితం వరకూ ప్రభాస్ ఓ మోస్తరు బడ్జెట్ చిత్రాల్లోనే నటించాడు. అయితే, రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత అతడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు యంగ్ రెబెల్ స్టార్. ఈ కారణంగానే తన తర్వాతి చిత్రం 'సాహో'ను కూడా పాన్ ఇండియా రేంజ్లో రూపొందించాడు. ఇది హిందీలో సూపర్ డూపర్ హిట్ అయింది.
పట్టాలపై రాధే శ్యామ్... సరికొత్త పాత్రలో
ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకున్న ఈ మూవీలో ప్రభాస్ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు.
రెండు భారీ ప్రాజెక్టుల్లో రెబెల్ స్టార్ ప్రభాస్
'రాధే
శ్యామ్'
పట్టాలపై
ఉండగానే
ప్రభాస్..
మహానటి
దర్శకుడు
నాగ్
అశ్విన్
తెరకెక్కించబోయే
సినిమాలో
నటించేందుకు
గ్రీన్
సిగ్నల్
ఇచ్చాడు.
వైజయంతీ
మూవీస్
బ్యానర్పై
అశ్వనీదత్
దీన్ని
నిర్మిస్తున్నారు.
దీనితో
పాటు
'ఆదిపురుష్'
అనే
హిందీ
చిత్రాన్ని
కూడా
ప్రకటించాడు.
ఓం
రౌత్
రూపొందించనున్న
ఈ
సినిమాలో
ప్రభాస్..
శ్రీ
రాముడి
పాత్రను
పోషిస్తున్నాడు.
ఆలస్యంగా వచ్చినా ముందే మొదలైంది
'కేజీఎఫ్' మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న 'సలార్'లోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. లేటుగా ప్రకటించిన అన్నింటికంటే ముందే అంటే ఇటీవలే ప్రారంభించాడు. హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.
‘సలార్’లో విలన్గా దక్షిణాది స్టార్ హీరో
'కేజీఎఫ్'తో తన దర్శకత్వ ప్రతిభను దేశ వ్యాప్తంగా చాటుకున్నాడు ప్రశాంత్ నీల్. అందులో హీరో పాత్రను ఎలివేట్ చేసి చూపించిన తీరు ఆహా అనిపించింది. దీంతో 'సలార్'లోనూ అదే ఫాలో అవుతాడని తెలుస్తోంది. ఇక, అతడి సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కూడా ఉంటుంది. అందుకే దీని కోసం దక్షిణాది స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఎంపిక చేసుకున్నారని తెలిసింది.
ఆ సినిమా తర్వాత నిర్ణయం మారిందట
వాస్తవానికి ఈ సినిమా కోసం బాలీవుడ్ విలన్ను తీసుకు రావాలని ప్రశాంత్ నీల్ అనుకున్నాడట. అయితే, విజయ్ నటించిన 'మాస్టర్'లో విలన్గా విజయ్ సేతుపతి అద్భుతమైన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇక, ఈ సినిమా తర్వాత ప్రశాంత్ తన నిర్ణయాన్ని మార్చుకుని దక్షిణాది హీరోనే తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం.