Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
18ఏళ్ల తరువాత మెగాస్టార్ సినిమాలో రాములమ్మ.. ఎందుకంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కాంబినేషన్స్ అంటే ఆడియెన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు డైరెక్టర్ హీరోల కాంబినేషన్స్ కి ఎక్కువ క్రేజ్ అందుతోంది. కానీ ఒకప్పుడు హీరో హీరోయిన్ ఇక్కసారి హిట్టు కొట్టి మళ్ళీ కలిసి నటిస్తే.. ఆ సినిమాలకు వచ్చే బజ్ మరే సినిమాకు వచ్చేది కాదు. అలాంటి బెస్ట్ కాంబినేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి - విజయశాంతి జోడి బెస్ట్ కాంబో అనిపించుకుంది. అయితే 18 ఏళ్ల తరువాత మళ్ళీ రాములమ్మ మెగాస్టార్ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
బెస్ట్ హిట్స్..
విజయశాంతి - చిరంజీవి కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు బాక్సాఫీస్ వద్ద సాలీడ్ సక్సెస్ అందుకున్నవే.. మెయిన్ గా గ్యాంగ్ లీడర్, స్వయం కృషి, ఛాలెంజ్ వంటి సినిమాలు వారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. దాదాపు డజనుకు పైగా సినిమాల్లో నటించిన ఈ స్టార్స్ ఒకే స్క్రీన్ పై కనిపించి చాలా కాలమవుతోంది. ఇక ఇన్నాళ్లకు ఒక సినిమాతో వీళ్ళు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.
మహేష్ వేడుకలో మెగా ఎట్రాక్షన్..
మహేష్ బాబు సరిలేరు నికెవ్వరు ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ వేడుకలో మహేష్ బాబు కంటే కూడా మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. వారు మాట్లాడుకున్న తీరు అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇన్నాళ్లకు కలిసి నటించబోతున్నారు అనే టాక్ వస్తోంది.
18ఏళ్ల తరువాత..
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి చివరగా నటించిన చిత్రం మెకానిక్ అల్లుడు. 1993లో వచ్చిన ఆ సినిమా తరువాత మళ్ళీ వీరిద్దరు కలిసి నటించింది లేదు. ఇక ఇప్పుడు లూసిఫర్ రీమేక్ కోసం ఆమె నటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దర్శకుడు సుజిత్ ఆలోచన ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఆమెను ఒక కీలక పాత్ర కోసం సంప్రదించారట. అందుకు విజయ శాంతి కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
విజయశాంతి స్పెషల్ రోల్!
మలయాళం లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో విజయశాంతి పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. మలయాళంలో మంజు వారియర్ చేసిన పాత్రలో రాములమ్మ నటించబోతోందట. అందుకు సంబంధించిన కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సరిలేరు నికెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఈ సినిమాలో ఎలా కనిపిస్తుందో చూడాలి.