Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరో సినిమాకు ఓకే చెప్పిన విజయశాంతి.. ఇది కూడా ఆయనతోనే!
మొన్నటిదాకా రాజకీయ కార్యక్రమాలతోనే బిజీ బిజీగా ఉన్న లేడీ అమితాబ్ విజయశాంతి సడెన్గా మహేష్ బాబు 26లో నటించడానికి ఓకే చెప్పడంతో తెలుగు ప్రేక్షకుల్లో సరికొత్త ఆసక్తి మొదలైంది. ఇన్నేళ్ల తర్వాత రాములమ్మ తిరిగి కెమెరా ముందుకొస్తోందంటే.. ఖచ్చితంగా తనదైన శైలిలో పాత్ర పరిధి ఉంటుందని ఫిక్సయ్యారు ప్రేక్షకులు. మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణం చేసి అశేష అభిమాన వర్గాన్ని సొంతం చేసుకున్న విజయశాంతి తిరిగి వెండితెరపై అడుగుపెట్టడాన్ని స్వాగతిస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్.
దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది విజయశాంతి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చిన విజయశాంతి.. పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్గా కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్ కనబర్చనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగానే తాజాగా విజయశాంతి మరో సినిమా ఓకే చేసిందనే ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అది కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే. ఇటీవలే తన దర్శకత్వంలో రూపొంది గ్రాండ్ సక్సెస్ సాధించిన 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట అనిల్. ఇందులో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని తీసుకునే దిశగా ఆలోచన చేసిన అనిల్.. ఆమెను సంప్రదించగా ఆ పాత్ర చేయడానికి విజయశాంతి ఆసక్తి చూపిందని సమాచారం. అంటే ఈ లెక్కన చూస్తే.. ఇక విజయశాంతి వెండితెర ప్రయాణం మరింత స్పీడ్ చేయనుందని అర్థమవుతోంది కదూ!
ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమా విషయానికొస్తే.. అనిల్ రావిపూడి స్టైల్లోనే తన రెగ్యులర్ పంథాలో 'సరిలేరు నీకెవ్వరు'లో కూడా కామెడీ పార్ట్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారట. ఈ సినిమాలో కశ్మీర్ టు ఆంధ్ర ట్రైన్ ఎపిసోడ్ ఆద్యంతం ఆకట్టుకోనుందని తెలుస్తోంది. ఇక మహేష్, రష్మిక మందన్న రొమాన్స్కి ప్రియారిటీ ఇస్తూ కొన్ని సన్నివేశాలు హై లెవెల్లో ఉండనున్నాయని సమాచారం. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కానుంది.