Don't Miss!
- News ఈ అభిమానమే రఘురామ రాజుకు సీటు దూరం చేసింది..!!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేశ్ సినిమాలో విజయశాంతి రోల్ ఇదే.. బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇందులో మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా, ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి మరోసారి మేకప్ వేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఇటీవల దర్శకుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన విషయం తెలిసిందే.
2006లో 'నాయుడమ్మ' అనే సినిమాలో చివరి సారిగా కనిపించిన విజయశాంతి.. ఆ తర్వాత మరోసారి ఆమె మేకప్ వేసుకోలేదు. సినిమాలకు బ్రేకిచ్చి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ.. తెలుగు రాష్ట్రాల్లో తన మార్కును చూపించారు. ఎంపీగా విజయం సాధించిన తర్వాత మరింత స్పీడు పెంచారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ మారడంతో కొంచెం వెనుకబడ్డారు. ఇక, రీఎంట్రీలో మాత్రం దుమ్ము దులుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె మహేశ్ సినిమా ద్వారా మరోసారి టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, 'సరిలేరు నీకెవ్వరు'లో విజయశాంతి ఏ పాత్రలో నటిస్తున్నారన్న దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ, దీని గురించి ఎన్నో వార్తల ప్రచారం అయ్యాయి. ఆమె.. మహేశ్ తల్లిగా నటిస్తుందని కొందరు అంటే.. కాదు కాదు.. మహేశ్ స్నేహితుడి తల్లిగా కనిపించబోతుందని మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ విషయంపై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో విజయశాంతి ప్రొఫెసర్గా కనిపించబోతున్నారట. అది కూడా పవర్ఫుల్ క్యారెక్టర్ అని తెలిసింది. ఇందులో ఆమె పాఠాలు చెప్పడంతో పాటు ఎంతో మందిని చైతన్యపరిచే డైలాగ్స్ చెబుతుందని టాక్. గతంలో కూడా విజయశాంతి ఈ తరహా పాత్రలు చేశారు. అప్పుడు ఆమెకు అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఈ లేడీ అమితాబ్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది.